సౌత్ ఆడియెన్స్ పై బాలీవుడ్ స్టార్ హీరో కీలక కామెంట్స్ వైరల్.!

ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ శాండిల్ వుడ్ లాంటివి ఏవి లేవని మన హీరోలు అంటారు. అందుకు తగ్గట్టుగానే పలువురు హీరోలు దర్శకులతో సినిమాలు చేయడం అలాగే ఒక భాష నుంచి మరో భాషలో ఆడియెన్స్ సినిమాలు ఆదరించడం అయితే కామన్ అయ్యిపోయింది.

అయితే ఇప్పటికీ కొందరు హీరోలు కానీ ఆడియెన్స్ కానీ తమ ఇండస్ట్రీ ఆదరణ ఇతర ఇండస్ట్రీల్లో వస్తున్న దాని విషయంలో అయితే కాస్త డిజప్పాయింటింగ్ గానే ఉన్నారని చెప్పాలి. మెయిన్ గా బాలీవుడ్ హీరోలు వారిలో లేటెస్ట్ గా ప్రముఖ స్టార్ హీరో షాహిద్ కపూర్ అయితే కీలక స్టేట్మెంట్ చేయడం వైరల్ గా మారింది.

షాహిద్ కపూర్ సౌత్ ఇండియా సినిమా ఆడియెన్స్ పై మాట్లాడుతూ ఇక్కడ మా దగ్గర హిందీ ప్రేక్షకులు ఎలా అయితే భారీ ఎత్తున సౌత్ ఇండియా సినిమాలు ఆదరిస్తున్నారో అదే విధంగా సౌత్ ఆడియెన్స్ కూడా మా చిత్రాలను ఆదరించాలి అని అప్పుడే మొత్తం ఇండియన్ సినిమా అవుతుందని కానీ నిజానికి పరిస్థితి వేరేలా ఉంది అన్నట్టుగా తాను కామెంట్ చేసాడు.

అయితే సినిమాని ఎంజాయ్ చేయడంలో హిందీ ఆడియెన్స్ తో పాటుగా మన తెలుగు ఆడియెన్స్ కూడా ఎప్పుడూ ముందుంటారు. ఇది ఎందరో హీరోలు చెప్పిన మాట. అలాంటిది ఇపుడు షాహిద్ చేసిన కామెంట్స్ ఎవరికి వర్తిస్తాయో చెప్పక్కర్లేదు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ కబీర్ సింగ్ హీరో కామెంట్స్ ఇపుడు సినీ వర్గాల్లో టాపిక్ గా మారాయి.