మహేష్‌తో కృతిసనన్ ఇంకోస్సారి.!

‘వన్ నేనొక్కడినే’ సినిమాతో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. తొలి సినిమా హిట్ కాలేదు. ఆ తర్వాత నాగ చైతన్యతో ‘దోచేయ్’ సినిమాలో నటించింది ఈ పొడుగు కాళ్ల సుందరి. ద్వితీయ విఘ్నం కూడా వెంటాడింది కృతి సనన్‌ని. దాంతో, వెనుదిరిగి చూడకుండా టాలీవుడ్ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పేసి, బాలీవుడ్‌కి చెక్కేసింది. మొదట్లో అక్కడా తటపటాయించింది కృతి సనన్ కెరీర్.

కానీ, ఇప్పుడు కృతికి అక్కడ లక్కు చిక్కింది. వరుస సూపర్ హిట్లూ, క్రేజీ ఆఫర్లూ.. తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించింది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో ప్రబాస్ సరసన నటిస్తోంది. అదే ‘ఆది పురుష్’ సినిమా. ‘ఆదిపురుష్’ ఎలాగూ ప్యాన్ ఇండియా సినిమా. సో, అది కాదు అసలు ముచ్చట. ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ లెవల్ ఆదరణ దక్కించుకుంటోంది. అందుకే తెలుగు సినిమాపై బాలీవుడ్ భామలు బాగా ఫోకస్ పెడుతున్నారు.

ఆ క్రమంలోనే త్రివిక్రమ్ – మహేష్ కాంబో మూవీలో కృతి సనన్ స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీలీల సెకండ్ హీరోయిన్ రోల్ పోషిస్తోంది. ఇక, కృతి సనన్ స్సెషల్ సాంగ్ సినిమాకి మరో అస్సెట్ కానుందని చెప్పొచ్చేమో.