Prabhas : మరోసారి కుళ్ళు బయటపెట్టుకున్న బాలీవుడ్…ప్రభాస్ క్రేజ్ చూసి ఈర్ష్య పడుతున్న వైనం…!

Prabhas : మరోసారి తన కుళ్ళు బుద్ధి చూపింది బాలీవుడ్. కొందరు కావాలనే యంగ్ రెబెల్ స్టార్ ను టార్గెట్ చేస్తున్నారు.బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఇండియాలో క్రేజీ హీరో అయ్యాడు ప్రభాస్.పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. బాలీవుడ్ లో బాగా క్రేజ్ సంపాదించడంతో తన నెక్స్ట్ సినిమాలపై అంచనాలు బాగా పెరిగాయి.ఇక బాహుబలి తరవాత ప్రభాస్ సాహో సినిమాలో నటించాడు.

భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది . ఇక ప్రభాస్ అంటే అసూయ పడేవాళ్లకి ఒక అవకాశం దొరికింది.కానీ సాహో బాలీవుడ్ లో మంచి వసూళ్లను రాబట్టింది. ఇక తెలుగులో నేటివిటీ మిస్ అవ్వడం వల్ల సినిమా ప్లాప్ అయింది ఇక ఆ తరువాత చాలా గ్యాప్ తో వచ్చిన సినిమా రాధే శ్యామ్ మొదటి నుండి బాలీవుడ్ మీడియాలో ప్రభాస్ ను టార్గెట్ చేయడం, ఇక సినిమా ప్రభాస్ అభిమానులకు నచ్చక పోవడంతో ఇక ప్రభాస్ పై ట్రోల్స్ నెగెటివ్ కామెంట్స్ పెరిగాయి.

ఆ చిన్న అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టలేదు. ఇక సినిమా విమర్శకులుగా చెప్పుకునే చాలా మంది ఇక హద్దులు దాటి ప్రభాస్ పై విమర్శలు చేసారు. రాధే శ్యామ్ లో ప్రభాస్ లుక్స్ పై కామెంట్స్ చేసారు బాగా కనిపించేలా చేయడానికి గ్రాఫిక్స్ వాడారాని అయిన ప్రభాస్ బాగా లేడని షేప్ అవుట్ అయిపోయాడని మాట్లాడారు. చాలా మితిమీరి ప్రభాస్ కు భాగ్యశ్రీ చెల్లి లా కనిపిస్తోందని వాగారు.ఇక ఇపుడు వాడప్పావ్ లా ప్రభాస్ కనిపిస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ను తట్టుకోలేని కొంతమంది బాలీవుడ్ జనాలు ఇలా ప్రభాస్ పై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.కానీ ప్రభాస్ మాత్రం తన ప్రాజెక్ట్స్ లో బిజీ గా ఉన్నాడు.