అఖిల్ కోసం నేను ఆ అని చేయడానికి అయినా సిద్ధం:బిందు మాధవి

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 17 మంది కంటెస్టెంట్ తో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే కంటెస్టెంట్ మిగిలారు. ఇకపోతే పదవ వారం ఎలిమినేషన్ కూడా దగ్గర పడుతోంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తి పెరిగింది. అయితే నిన్న మొన్నటిదాకా సాదాసీదాగా సాగిన ఈ షోలో ప్రస్తుతం కంటెస్టెంట్ ల మధ్య పోటీ వాతావరణం నెలకొంది.

ఇకపోతే హౌస్ మొదట్లో నుంచి అఖిల్, బిందుమాధవి లు ఒకరిని చూస్తే ఇంకొకరు కోప్పడుతూ ఉంటారు. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదటినుంచి జరుగుతోంది. ఇక వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా వీరిద్దరూ చిటపటలాడుతూ ఉంటారు. అయితే తాజాగా టాస్క్ లో భాగంగా ఈ యుద్ధం మరింత పెద్దది అయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎవిక్షన్ ప్రీ పాస్ కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న బిందుమాధవి రెచ్చిపోయింది.

అఖిల్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉండగా.. వెనకాల సోఫాలో కూర్చున్న అనిల్, యాంకర్ శివ, బిందు మాధవిలో అతడిపై జోకులు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బిందుమాధవి మరింత రెచ్చిపోతూ అఖిల్ కోసం చెయ్యి కోసుకుంటా అని కత్తి పట్టుకుని హల్చల్ చేసింది. అయితే ఆ తర్వాత అంతా కూడా జోక్ అని అనగా అఖిల్ కూడా తనపై బిందుమాధవి జోకులు వేస్తున్న కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా నవ్వుతూ ఉండటం, బిందు మాధవి కి గోరుముద్దలు కూడా కనిపించడంతో ఆమె కూడా వద్దనకుండా తినింది. ఇదంతా చూసిన హౌస్ మేట్లు ఒక్కసారిగా షాకయ్యారు.