బింబిసార – కళ్యాణ్ రామ్ ఎమోషనల్ కామెంట్స్!

నందమూరి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ గత కొంతకాలం నుంచి ఏ విధమైనటువంటి హిట్ సినిమాలు లేక ఎంతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన తాజాగా బింభిసార అనే సోషియో ఫాంటసీ టైం ట్రావెల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో వశిష్ట అనే దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతోనే మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కమర్షియల్ గా అత్యధిక కలెక్షన్లను కూడా రాబట్టింది. ఈ సినిమా విడుదలైన రెండు రోజులలోనే బ్రేక్ ఈవెన్ కాగా ప్రస్తుతం లాభాల బాటలో దూసుకుపోతోంది. ఇలా ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తనకు బింబిసారా సినిమా పునర్జన్మ లాంటిది అంటూ వ్యాఖ్యానించారు.

ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ అలాగే ఈ సినిమాపై ప్రముఖ సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్న తీరు చూస్తుంటే ఈ సినిమా నాకు పునర్జన్మ లాంటిదని ఈయన కామెంట్లు చేశారు.ఇలా నిత్యం కొత్త కథలను ఎంపిక చేసుకొని నా చివరి క్షణం వరకు ఇండస్ట్రీలో కొనసాగుతానని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ ఎమోషనల్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా పై ఇప్పటికే ఎన్టీఆర్, బన్నీ, విజయ్ దేవరకొండ, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు స్పందించి సినిమాపై ప్రశంసలు కురిపించారు.