బిగ్బాస్ నాల్గో సీజన్లో మోనాల్ గజ్జర్ను చూస్తే మధుప్రియ, దీప్తి సునయ, శివ జ్యోతి గుర్తుకు రాకమానదు. ఊ అంటే చాలు ఏడ్వడం తప్పా చేసేది ఏమీ ఉండదు. బిగ్బాస్ హౌస్లో ఏడుపుకు చిహ్నంగా మోనాల్ మారిపోయింది. ఏ విషయం వచ్చినా సరే మొదటగా ఏడుపే వచ్చేస్తోంది. అయితే ఒకానొక స్థితిలో ఇదంతా సింపతీ కోసం చేసే స్ట్రాటజీ అని ప్రేక్షకులు భావించే పరిస్థితికి వచ్చేస్తుంది. ఈ రెండు రోజుల్లోనే మోనాల్పై లెక్కలేనన్ని మీమ్స్ పుట్టుకొచ్చాయి.
బిగ్బాస్ హౌస్ వాతావరణాన్ని తట్టుకోలేక మధుప్రియ, ఇంట్లో వాళ్లు గుర్తొస్తున్నారని దీప్తి సునయన, ఇక ప్రతీ విషయానికి ఏడ్చే శివ జ్యోతిలకు పోటీగా మోనాల్ వచ్చింది. పాతాళ గంగలా పేరు తెచ్చుకున్న శివజ్యోతిని మించిపోయిందని మోనాల్పై సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్స్.
పాపం మోనాల్కు సపోర్ట్ చేసేవారెవ్వరూ కనిపించడం లేదు. పైగా హిందీలో, ఇంగ్లీష్లో తప్పా మరో భాషలో మాట్లాడటమే లేదు. ఏడుస్తూనే పుటేజ్ దక్కించుకుంటోందని నెగెటివ్ టాక్ వచ్చేసింది. ఇక మోనాల్ ఏడ్పుపై వస్తోన్న ట్రోల్స్, మీమ్స్ ఎంజాయ్ చేసే వర్గం మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీలవుతోంది. మొదటి రోజు ఫ్యామిలీ, తండ్రి, లైఫ్ జర్నీ చెబుతూ ఏడ్చేసింది. ఇక రెండో రోజు వంటగది, వంట విషయంల్ ఏడ్చేసింది.
వెజ్, నాన్ వెజ్ సపరేట్గా వండండని చెప్పి వదిలేయక దాన్ని పెద్ద సీన్ చేసేసింది. చెప్పిన విషయాన్నే చెప్పి చెప్పి అందరికీ విసుగు తెప్పించింది. దానికి తోడు ఆ ఏడుపును చూడలేకపోతున్నారు. ఇక ఆమె ఓదార్చడంలో కరాటే కళ్యాణి, సుజాత మునిగిపోయారు. మోనాల్ ఏడ్పుపై వస్తోన్న మీమ్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా మొత్తానికి మోనాల్ మాత్రంసోషల్ మీడియాలో బాగానే హాట్ టాపిక్ అవుతోంది.