Bigg Boss Non Stop: ఎంట్రీ ఇవ్వనున్న మాజీ కంటెస్టెంట్?

Bigg Boss Non Stop: ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ ఐదో సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు బిగ్ బాస్ షో అంటూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన షో నిర్వాహకులు మొదటిసారిగా తెలుగులో బిగ్ బాస్ ఓటీటీ ని ట్రై చేశారు. అయితే బిగ్ బాస్ ఓటీటీ కి కూడా ప్రేక్షకుల నుంచి బాగానే రెస్పాన్స్ వచ్చింది. మొదట్లో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ మెల్లమెల్లగా ఈ షో కి మంచి ఆదరణ దక్కింది. ఇకపోతే ప్రస్తుతం ఈషో సక్సెస్ ఫుల్ గా సాగుతున్న విషయం అందరికి తెలిసిందే. 17 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ షోలో ప్రస్తుతం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు.

వీరిలో ఎవరు ఫైనల్ కు చేరుకుంటారు ఎవరు రన్న రప్ గా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే హౌస్ లో కుటుంబ సభ్యులను అదేవిధంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సో నిర్వాహకులు ఇప్పటి వరకు కుటుంబ సభ్యులను ఫ్రెండ్స్ ని హౌస్ లోకి పంపిన నిర్వాహకులు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 టాప్ కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపించపోతున్నారు. అయితే ఒక్కొక్క రోజుఒక్కొక్కరినీ హౌస్ లోకి పంపనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామ్, మానస్, సిరి లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మరొక వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే మే 21న ఫినాలే జరగనుందని అయితే ఫినాలే ఎపిసోడ్ కి హోస్ట్ గా నాగార్జున కాకుండా టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ను ఫినాలే ఎపిసోడ్ కి రంగంలోకి దింపనున్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజా నిజాలు పక్కనపెడితే బాలకృష్ణ బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నాడు అని తెలియడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.