Bigg Boss 5 Telugu: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.! బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్స్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఎట్టకేలకు చివరి దశకి చేరుకుంది. గత కొన్ని వారాలుగా అన్ లిమిటెడ్ ఫన్ అందిస్తూ ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేశారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్. కాజల్ ఎలిమినేట్ అవ్వడంతో సిరి, షణ్ముఖ్, సన్నీ, మానస్, శ్రీరామ్ చంద్రలు గ్రాండ్ ఫినాలేకి చాలా గ్రాండ్ గా ఎంటరయ్యారు. వీరిలో బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. డిసెంబర్ 19 ఆదివారం బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించిన సన్నాహాలు ముందుగానే మొదలు పెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు.

ప్రతి సీజన్ యొక్క గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని చాలా గ్రాండ్ గా నిర్వహిస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం. ఈ సారి జరగబోయే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని అంగరంగ వైభవంగా జరిపేందుకు పెద్ద మాస్టర్ ప్లానే వేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇప్పటివరకూ టాలీవుడ్ సెలబ్రిటీస్ నే పిలిచి వాళ్ళ చేత విన్నర్ ని ప్రకటించే వాళ్ళు. కానీ ఈ సారి కథ మారిపోయింది. మునుపెన్నడు జరగని ఘటన బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ లో జరగబోతుంది.

బిగ్ బాస్ 5వ సీజన్‌ కోసం ఏకంగా బాలీవుడ్‌ స్టార్‌లను రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనే, అలియా భట్‌ ఈ గ్రాండ్‌ ఫినాలేకు వస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీరితో పాటు రామ్‌చరణ్‌ కూడా సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీమ్‌ కూడా గ్రాండ్‌ ఫినాలేలో కాసేపు తళుక్కుమనబోతున్నారని టాక్‌ వినిపిస్తోంది. మరిఇది ఎంతవరకు నిజమో అని తెలియాలంటే ఇంకో ఐయిదు రోజుల వరకు ఆగాల్సిందే.