బిగ్ బాస్‌4: బిగ్ బాస్‌లో దెయ్యం వాయిస్.. గీతా మాధురి క్లారిటీ!

Bigg Boss 4 Telugu week 12 Geetha Madhuri Clarity On Ghost Voice

బిగ్ బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్‌లో ఓ దెయ్యం రచ్చ రచ్చ చేసింది. ఇక ఈ వారం మొత్తం ఆ దెయ్యమే ఉండేలా కనిపిస్తోంది. నిన్నటి వచ్చిన దెయ్యం ఎవరై ఉంటుందా? అని ఇంటి సభ్యులతో పాటు బయట ఆడియెన్స్ కూడా ఆరా తీశారు. అది హరితేజ అని చాలా మంది బయట అనుకున్నారు. కానీ తాను కాదని హరితేజ క్లారిటీ ఇచ్చింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో దెయ్యం గొంతు విన్నాక చాలా మందికి కొన్ని అనుమానాలు వచ్చాయి.

Bigg Boss 4 Telugu week 12 Geetha Madhuri Clarity On Ghost Voice
Bigg Boss 4 Telugu week 12 Geetha Madhuri Clarity On Ghost Voice

ఇంటి సభ్యులు అయితే అది రీ ఎంట్రీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ, స్వాతి దీక్షిత్ అని అనుమాన పడ్డారు. అయితే బయట మాత్రం ఇంకొన్ని పేర్లు బయటకు వచ్చాయి. అందులో మరీ ముఖ్యంగా గీతా మాధురి పేరు బాగా చక్కర్లు కొట్టింది. ఆ గొంతు గీతా మాధురిదే అని అందరూ అభిప్రాయ పడ్డారు. ఇక ఈ విషయంలో అందరూ గీతా మాధురికి మెసెజ్‌లు చేస్తుండటంతో ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు వీడియోలు రిలీజ్ చేసింది. అందులో అసలు గొంతు ఎవరిదో చెప్పేసింది.

బిగ్ బాస్‌ షోలో వినిపించిన గొంతు తనది కాదని గీతా మాధురి చెప్పింది. తనలా అనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. అయితే ఆ గొంతు సమీరా భరద్వాజ్ అని చెప్పింది. తనను చాలా ప్రభావితం చేశామని సమీరపై గీతా మాధురి స్వీట్‌గా అలిగింది. మొత్తానికి దెయ్యం గొంతుపై గీతా మాధురి అయితే ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఇక నేడు కూడా ఈ దెయ్యం ఇంటి సభ్యులను ఆట ఆడించబోతోందని తెలుస్తోంది.