బిగ్ అప్డేట్ : “బ్రో” ట్రైలర్ కి ముహూర్తం ఖరారు.!

ప్రస్తుతం టాలీవుడ్ దగ్గర మంచి అంచనాలు ఉన్న ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా సుప్రీం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లు నటించిన చిత్రం “బ్రో ది అవతార్” అనే చెప్పాలి. కాగా ఈ చిత్రం అయితే దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నారు.

అలాగే తాను ఈ సినిమాతోనే టాలీవుడ్ కి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ చిత్రం అయితే ఇప్పుడు రిలీజ్ కి దగ్గరగా వస్తుంది. అయితే పాటలు ఏమో ప్లాప్ అవుతున్నాయి. దీంతో అంచనాలు కూడా నెమ్మదిగా సన్నగిల్లుతున్నాయి. ఇక ఈ సినిమాకి ఏదన్నా చేయాలి అంటే అది సినిమా ట్రైలర్ సహా ప్రీ రిలీస్ ఈవెంట్ లలోనే చేయాల్సి ఉంది.

కాగా ఇప్పుడు ఈ థియేట్రికల్ ట్రైలర్ పై అయితే లేటెస్ట్ గా బేబీ సినిమా సక్సెస్ మీట్ బ్రో నిర్మాత క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు బిగ్ అప్డేట్ గా మారింది. అయితే బ్రో నిర్మాత విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ బ్రో ట్రైలర్ ని ఈ జూలై 21న గ్రాండ్ గ రిలీజ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీనితో ఈ బిగ్ అప్డేట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

కాగా ఈ చిత్రంలో అయితే కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి అందిస్తున్నారు. అలాగే థమన్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. జూలై 28న ఈ చిత్రం థియేటర్స్ లో రాబోతుంది.