Big Boss Non Stop: నామినేషన్ ప్రక్రియలో బిందుమాధవి, అఖిల్ మధ్య చెలరేగిన వివాదం..!

Big Boss Non Stop: బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఓటిటిలో ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇదివరకటి సీజన్లోలా కాకుండా ప్రస్తుతం ఉన్న ఈ సీజన్ ప్రేక్షకుల నుండి ఆశించిన విధంగా ఆదరణ పొందలేకపోయింది. ఓటీటీలో 24 గంటలు పాటూ ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. 17 మంది కంటెస్టెంట్ ల తో మొదలైన ఈ రియాలిటీ షో లో ఇప్పుడు కేవలం పదిమంది కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు. పోయిన వారం మహేష్ విట్టా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.

మహేష్ హౌజ్ లో తనదైన రీతిలో గేమ్ ఆడుతూ ఓటింగ్ పరంగా కూడా ముందంజలోఉన్నాడు. మహేష్ ఎలిమినేట్ అవ్వటంతో ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే మహేష్ ని బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ చేశాడని మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ఎలిమినేట్ అయిన సమయంలో నాగార్జున మహేష్ ని స్టేజ్ మీదకి వెళ్ళి హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్ లలో ఎవరు పుష్పాలు ఎవరు ఫైర్ అని అడగగా తనదైన రీతిలో తన అభిప్రాయాన్ని నాగార్జున గారికి వివరించాడు.

మహేష్ ఎలిమినేట్ అయిన తర్వాత 8వ వారం లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది.వారంలో మిగిలిన రోజులన్నీ ఎంతో కలిసిమెలిసి ఉండే కంటెస్టెంట్ లు నామినేషన్ ప్రక్రియ మొదలవగానే ఒకరిమీద ఒకరు మాటలతో దాడి చేసుకుంటారు.8వ వారం నామినేషన్ ప్రక్రియ లో కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగినట్లు సమాచారం. ఈవారం నామినేషన్ లో భాగంగా ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరి పేర్లు చెప్పి వారి మొహం మీద నురుగు రాయాలి. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండే బిందుమాధవి, అఖిల్ మధ్య కూడా పెద్ద గొడవ జరిగింది. అఖిల్ బిందు మాధవిని నామినేట్ చేస్తూ ఆమె స్రవంతి పేరును వాడుకోవడం ఏమాత్రం నచ్చలేదని చెప్పాడు.

అఖిల్ మాటలకు బిందు మాధవి స్పందిస్తూ స్రవంతి నీకు ఇక్కడకి సేవలు చేయడానికి వచ్చిందా? తనని ఎమోషనల్ గా వాడుకున్నావు అంటూ అఖిల్ మీద ఫైర్ అయ్యింది. బిందు మాధవి ఇలా మాట్లాడటంతో అఖిల్ ఏం మాట్లాడుతున్నావ్..?వాడుకోవడం ఏంటి? తన వెళ్లిపోయిన తర్వాత తన గురించి స్టాండ్ తీసుకున్నావ్ అంటూ బిందు మాధవి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా వీరిద్దరూ గొడవ పడుతూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు.