Bhanu chandar : సింహాద్రి టైములోనే రాజమౌళికి చెప్పా… ఇప్పటి దర్శకులు జక్కన్న ను చూసి చాలా నేర్చుకోవాలి…!

Bhanu chandar : రాజమౌళి, ఎన్టీఆర్‌తో చేసిన రెండో సినిమా సింహాద్రి. ఈ సినిమా అప్పట్లో సంచలనం. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిల్చింది. ఇక సినిమా లో నటించిన భాను చందర్ ఈ సినిమా తరువాత రాజమౌళి చాలా బిజీ దర్శకుడు అవుతాడని చెప్పానంటూ భాను చందర్ రాజమౌళి గురించి వివరించారు. సింహాద్రి సినిమా తర్వాత ఫోన్ చేస్తే మీరు అందుబాటులోకి రావడం కష్టమవుతుందని రాజమౌళితో చెప్పానని భానుచందర్ అన్నారు.

రాజమౌళి నుంచి సినిమా తీయడంతో పాటు ప్రచారం చేయడం, హిట్ చేయడం నేర్చుకోవాలని ఆయన అన్నారు. చాక్లెట్ పేపర్ లో మట్టిని పెట్టి అద్భుతమైన చాక్లెట్ అని రాజమౌళి నమ్మించగలరని ఆయన కామెంట్లు చేశారు. ఇలా ఎవరు పడితే వాళ్లు చేయలేరని అందుకు టాలెంట్ ఉండాలని ఆయన అన్నారు.

ఇక రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ తరువాత తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతున్నారు. మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న జక్కన్న ఈ సినిమా అడ్వెంచర్ కథ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇక సినిమాలో ఒక్క సన్నివేశానికైనా కుడా తాను అనుకున్న ఔట్ పుట్ కోసం రాజీపడకుండా కష్టపడే జక్కన్న ఈ సినిమా ద్వారా మహేష్ కు తన కెరీర్ లో బెస్ట్ హిట్ ఇస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.