నా మీద క్ర‌ష్ అని చెప్పి ప్ర‌భాస్ ఉక్కిరిబిక్కిరి చేశాడు.. హీరోయిన్ స్టన్నింగ్ కామెంట్స్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాతో నేష‌న‌ల్ స్టార్‌గా మారాడు. ఆయ‌న‌కు దేశ విదేశాల‌లో లెక్కకి మించిన అభిమానులు ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ఈయ‌న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరే. 41 ఏళ్ళ వ‌య‌స్సు ఉన్న ప్ర‌భాస్ ఇంకా సోలోగా ఉండ‌డాన్ని ఆయ‌న అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. అయితే ప్ర‌భాస్‌కు ఎవ‌రిపైనైన క్ర‌ష్ ఉందా అని అభిమానులు ఆలోచిస్తున్న క్ర‌మంలో సీనియ‌ర్ హీరోయిన్ స్ట‌న్నింగ్ వ్యాఖ్య‌లు చేసి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

సల్మాన్ ఖాన్ రొమాంటిక్ మూవీ ‘మైనే ప్యార్ కియా’తో ఇండస్ట్రీకి పరిచయమైన భాగ్యశ్రీ తొలి చిత్రంతోనే అంద‌రి మ‌న‌సుల‌ను కొల్ల‌గొట్టారు. హిందీ, త‌మిళం, తెలుగు, మ‌రాఠి, భోజ్‌పురి, క‌న్న‌డ ఇలా అనేక భాష‌ల‌లో చాలా సినిమాలు చేసిన భాగ్య శ్రీ 20 ఏళ్ళ త‌ర్వాత రాధే శ్యామ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ త‌ల్లిగా ఆమె క‌నిపించ‌నున్నారు. తాజాగా భాగ్య శ్రీ .. ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్‌కు నాపై క్ర‌ష్ ఉంద‌ని చెప్పాడంటూ బాంబ్ పేల్చింది. ప్రభాస్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్‌తో పాటు ప్రతి ఒక్కరూ ‘మైనే ప్యార్ కియా’ చూశారట‌. నా మీద క్రష్ చాలా ఉండేదని ప్రభాస్ నాకు స్వయంగా చెప్పారు’’ అని భాగ్యశ్రీ వెల్లడించారు.

ప్ర‌భాస్ చాలా మంచి మ‌నిషి. ఆయ‌న ఆతిథ్యం ఎప్పుడు గొప్ప‌గానే ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా ఉండే ప్ర‌భాస్ నేను తినే టేబుల్ పైన 15 ర‌కాల వంట‌కాల‌ను ఉంచారు. ఇవ‌న్నీ నేను తిన‌లేను అని ప్ర‌భాస్‌తో చెప్పినా కూడా విన‌లేదు. హైదరాబాద్ స్పెషల్ స్వీట్స్‌ కూడా ఆయన నాకు బహుమతిగా ఇచ్చారు’’ అని భాగ్యశ్రీ స్ప‌ష్టం చేశారు. సాహో చిత్ర స‌మ‌యంలోను శ్ర‌ద్ధా క‌పూర్‌కు వెరైటీ స్పెష‌ల్స్ తెప్పించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాధేశ్యామ్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్‌లో ఓ చిత్రం, ఆదిపురుష్ అనే చిత్రం చేస్తున్నాడు