యాభై లక్షలతో ఐదు కోట్లు.. పూరికి అలా సెటిల్ చేసిన బండ్ల గణేష్

Bandla Ganesh And Puri jagannadh Land Issue

బండ్ల గణేష్ సినిమాల్లో కంటే వ్యాపారంపరంగా, రియల్ ఎస్టేట్ పరంగా బాగా సంపాదించాడు.. సంపాదిస్తున్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణలో దాదాపు పౌల్ట్రీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు బండ్ల గణేష్. ఇక షాద్ నగర్ ఏరియాలో రియల్ ఎస్టేట్ కింగ్‌గా బండ్ల గణేష్‌కు తిరుగులేదు. ఆ విషయం చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు. బండ్లన్న తాజాగా అలీతో సరదాగా అనే షోలో పాల్గొన్నాడు.

Bandla Ganesh And Puri jagannadh Land Issue
Bandla Ganesh And Puri jagannadh Land Issue

ఇందులో పూరి జగన్నాద్ విషయంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. బండ్ల గణేష్ ఓ సారి పూరి ఆఫీస్‌కు వెళ్లాడట. డోర్ తీయడంతోనే పూరి కోపంగా కొన్ని డాక్యుమెంట్లను విసిరిపడేశాడట. అవి బండ్లన్న కాళ్ల కింద పడ్డాయట. అందులో షాద్ నగర్ అని కనిపించడంతో విషయం ఏంటో అని ఆరా తీశాడట. ఇక జరిగిందంతా పూరి వివరించాడట. షాద్ నగర్‌లో ల్యాండ్ కొన్నానని, యాభై లక్షలు ఒకడు మోసం చేశాడని చెప్పాడట.

Bandla Ganesh And Puri jagannadh Land Issue
Bandla Ganesh And Puri jagannadh Land Issue

పూరి జగన్నాద్ చెప్పిందంతా విన్న బండ్ల గణేష్ ఆ డ్యాకుమెంట్స్ తాను తీసుకుంటానని చెప్పాడట..తాను వాటిని సెటిల్ చేసి ఇస్తాను అని చెప్పాడట. అలా వాటిని తీసుకెళ్లి ఐదు కోట్లకు సెటిల్ చేసి ఆ డబ్బును పూరి జగన్నాద్ కి ఇచ్చాడట.అందుకే బండ్ల గణేష్ ను రియల్ ఎస్టేట్ కింగ్ అని అంటారు. ఇక బ్రహ్మానందంకు కూడా కొంత ల్యాండ్‌ను అక్కడ చూసి పెట్టాడట. ఏది ఏమైనా బండ్లన్న మామూలోడు కాదు.