నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన బాలయ్య.. తొలి ప్రాజెక్టు ప్రకటించేది ఆరోజే?

ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో బడా బ్యానర్లు కొనసాగుతున్నాయి. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు పలు బ్యానర్లలో నిర్మితమై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ ప్రొడ్యూసర్లుగా కొనసాగుతున్నారు.ఇక ఇండస్ట్రీలో కేవలం ప్రొడ్యూసర్లు మాత్రమే కాకుండా స్టార్ హీరోలు సైతం సొంత బ్యానర్లను నిర్మించి ఆ బ్యానర్ లో పలు సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.

ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ హీరోలు సొంత బ్యానర్ లను ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా మరొక సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఈ విధంగా హీరోగా అందరిని మెప్పించిన బాలయ్య నిర్మాతగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు.ఇందుకు బసవ తారకరామ క్రియేషన్స్‌ అనే బ్యానర్‌ను ప్రారంభించారు.

బాలకృష్ణ అంటేనే పవర్ ఫుల్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటి బాలకృష్ణ సొంత బ్యానర్ లో తొలి ప్రాజెక్ట్ గా ఎలాంటి చిత్రాన్ని ప్రకటిస్తారని అభిమానులు పెద్ద ఎత్తున ప్రాజెక్టు గురించి చర్చలు జరుపుతున్నారు. అయితే బాలకృష్ణ తన తొలి ప్రాజెక్టును ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం తన సొంత బ్యానర్ లో తొలి ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలను తెలియజేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం బాలకృష్ణ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.