లేటెస్ట్ : ప్రభాస్ ని ఆల్ మోస్ట్ ఒప్పించేసిన బాలయ్య డైరెక్టర్.!

ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పలు భారీ సినిమాలు చేయడమే కాకుండా రీసెంట్ గానే తెలుగు టాక్ షో ఆహా లో బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాప్పబుల్ కి వచ్చి సందడి చేసాడు. గతంలో ఏ షో లో కూడా ప్రభాస్ ఇంత ఉత్సాహంగా కనిపించలేదు. దీనితో ఈ ఎపిసోడ్ ఒక మెమొరబుల్ వన్ గా నిలిచిపోగా.

ఇప్పుడు సినీ వర్గాల నుంచి లేటెస్ట్ గా మరో ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది. బాలయ్య ప్రభాస్ లు ఇలా స్క్రీన్ షేర్ చేసుకోడం పక్కన పెడితే త్వరలోనే బాలయ్య దర్శకుడు ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ చాలా ఉన్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే రీసెంట్ గానే బాలయ్య తో దర్శకుడు గోపీచంద్ మలినేని చేసిన పవర్ ఫుల్ ఫ్యాక్షన్ డ్రామా వీరసింహా రెడ్డి సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత అనేక సక్సెస్ మీట్ లు కూడా పెట్టారు. మరి వీటిలో దర్శకుడు గోపీచంద్ అసలు విషయాన్ని బయట పెట్టాడు.

తాను ప్రభాస్ కి కూడా కథ చెప్పానని ఇంకా చాలా మంది తో సినిమాలు ఉంటాయని వెల్లడించాడు. ఇక ఇదిలా ఉండగా సినీ వర్గాలు నుంచి మరో సమాచారం ఏమిటంటే ఆల్రెడీ ప్రభాస్ కి గోపీచంద్ లైన్ అయితే నచ్చింది అని ఆల్ మోస్ట్ వీరి కాంబినేషన్ కూడా ఫిక్స్ అని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఎప్పుడు వీరి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో చూడాలి.