అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన బాలకృష్ణ?

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాలలో అద్భుతమైన నటనను కనబరిచి టాలీవుడ్ టాప్ హీరోగా పేరు సంపాదించుకున్న బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హీరోలకు దీటుగా సినిమాలలో నటిస్తున్నారు.ఇక ఈయన హీరోగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.తాజాగా బాలకృష్ణ బోయపాటి శీను దర్శకత్వంలో నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా విజయవంతం కావడంతో బాలకృష్ణ తన తదుపరి చిత్రాల పై ఎంతో శ్రద్ధ చూపుతున్నారు.అలాగే తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా బాలకృష్ణ భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అఖండ సినిమా మంచి వసూళ్లను రాబట్టడంతో బాలయ్య అమాంతం తన రెమ్యూనరేషన్ పెంచేశారు.అప్పటివరకు ఒక్కో సినిమాకి 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బాలకృష్ణ ఆ సినిమా తర్వాత ఏకంగా తన రెమ్యునరేషన్ డబుల్ చేశారు.

ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 40 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారు.ఏదిఏమైనా ఈ వయసులో కూడా బాలకృష్ణ ఏమాత్రం ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా తన మాస్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గోపీచంద్ మలినేని తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతో చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.