బాహుబ‌లి 2 రీరిలీజ్.. అవ‌ధులు దాటిన ఆనందం

బాహుబ‌లి 2 రీరిలీజ్.. అవ‌ధులు దాటిన ఆనందం

చరిత్ర తిర‌గ‌రాసిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి 2 చిత్రం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ సినిమా ప్ర‌పంచాన్ని షేక్ చేసిన ఓ ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చింది. క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని చంపాడు అనే ప్ర‌శ్న సామాన్యుల నుండి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రిని ఆలోజింప‌జేసేలా చేయ‌గా, దానికి బాహుబ‌లి 2 చిత్రం పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఇండియ‌న్ సినిమా రికార్డుల‌ని తిర‌గ‌రాయ‌డంతో పాటు చైనాలోను స‌రికొత్త రికార్డ్స్ న‌మోదు చేసుకున్న బాహుబ‌లిని రీరిలీజ్ చేసిన‌ట్టు తెలుస్తుంది.

బాహుబ‌లి సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు ఆణిముత్యాలే. ఎన్ని సార్లు చూసిన సినీ ప్రేక్ష‌కుల‌కు త‌నివితీర‌డం లేదు. బిగ్ స్క్రీన్‌పై ఈ సినిమాని చూస్తే ఆ థ్రిల్లే వేరుంటుంది. ఇందుకోస‌మేనేమో ప్ర‌భాస్ బ‌ర్త్‌డే ( అక్టోబ‌ర్ 23) రోజు అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు అమెరికా, జ‌పాన్ దేశాల‌లో స్పెష‌ల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేశారు. మ‌రోసారి బాహుబ‌లి 2 చిత్రాన్ని సెల్యులాయిడ్‌పై చూసిన అభిమానుల ఆనందానికి హ‌ద్దులు చెరిగిపోయాయి.

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధేశ్యామ్ చిత్రంతో బిజీగా ఉండ‌గా,ఈ చిత్రం ఇటలీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. మ‌రి కొద్ది రోజుల‌లో ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసి ఆ త‌ర్వాత వీలైనంత వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేయాల‌ని భావిస్తున్నారు. వ‌చ్చే ఏడాది థియేట‌ర్‌లోకి ఈ చిత్రం రానుంది. ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్రానికి సంబంధించి విడుద‌లైన వీడియో అభిమానుల‌కి రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది. రాధేశ్యామ్ త‌ర్వాత ప్ర‌భాస్ .. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం చేయ‌నున్నాడు. ఈ చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ మూవీకి కొన‌సాగింపుగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ అనే చిత్రం చేయ‌నున్నాడు. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా క‌నిప‌స్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా క‌నిపించ‌నున్నాడు.