అటెన్షన్ ప్లీజ్.. “బ్రో” ప్రీ రిలీజ్ పై ఫాన్స్ కి ముఖ్య గమనిక.!

ఇప్పుడు టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ బిగ్ రిలీజ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ లు నటించిన ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ ఇది. ఇక ఈ చిత్రాన్ని అయితే ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహించగా ఈ చిత్రాన్ని భారీ మార్పులు చేర్పులు మేకర్స్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

అయితే ఈరోజు హైదరాబాద్ లో మేకర్స్ శిల్పకళా వేదికలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈరోజు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడు అందించారు. అయితే నిజానికి ఈరోజు సాయంత్రం ఆరున్నర నుంచే స్టార్ట్ కావాల్సిన ఈ గ్రాండ్ ఈవెంట్ ని అయితే మేకర్స్ టైం మార్చేశారు.

ఈ ఈవెంట్ హైదరాబాద్ లో ఉన్న ట్రాఫిక్ మరియు భారీ వర్షాలు కారణంగా ఈవెంట్ ని ఆరున్నర స్టార్ట్ చేయడం లేదని దానిని రాత్రి ఎనిమిదిన్నర సమయం నుంచి మొదలు పెడుతున్నాం అని తెలిపారు. దీనితో ఫ్యాన్స్ అంతా ఈ ముఖ్య గమనికను చూసి అయితే దయచేసి కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయ్యి ఈవెంట్ కి అటెండ్ కావాలని సూచిస్తున్నారు.

మరి ఇది తేలిక చాలా మంది ఆల్రెడీ సాయంత్రంకే రీచ్ అయ్యిపోయే వారు కూడా ఉంటారని మేకర్స్ ఓ రెండు గంటలు ముందే అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ జూలై 28న ఘనంగా విడుదల కాబోతుంది.