వంశీ పైడిపల్లి.. తమిళ సినిమానే మళ్ళీ.?

మహేష్‌బాబుతో ‘మహర్షి’ సినిమాని తెరకెక్కించిన వంశీ పైడిపల్లి, ఈ సంక్రాంతికి ‘వారసుడు’ సినిమాని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ‘ద్విభాషా చిత్రం’ అని ఎంతలా దాని గురించి ప్రచారం చేసుకున్నా, తెలుగు సినీ అభిమానులకి అది కేవలం డబ్బింగ్ సినిమానే అయ్యింది. సంక్రాంతి హోరులో ‘వారసుడు’ అలా అలా కొట్టుకుపోయిందంతే. ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల ఓవర్ ఫ్లోస్ ఓ మోస్తరుగా వచ్చాయి ‘వారసుడు’కి. థియేటర్ల విషయంలో దిల్ రాజు చాలా ఇబ్బంది పెట్టాడు ఆ రెండు సినిమాలకి.. అది వేరే చర్చ.

ఇక, తన తదుపరి సినిమాని కూడా వంశీ పైడిపల్లి ఓ తమిళ హీరోతోనే చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తమిళ హీరో తెలుగు ప్రేక్షకులకీ సుపరిచితుడేనట. పైగా, తమిళ హీరో విజయ్ కంటే సదరు తమిళ హీరోకి తెలుగునాట మంచి మార్కెట్ వుందట.

‘దిల్’ రాజు ఈ సినిమాని నిర్మిస్తారా.? లేదా.? అన్నదానిపై కాస్త స్పష్టత రావాల్సి వుంది. ఓ తెలుగమ్మాయ్‌కి ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ఖరారు చేశాడట దర్శకుడు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.