మళ్ళీ ప్రభాస్ స్నేహితులతో కలిసిన అనుష్క

టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి ఎలాంటి సినిమా చేసినా కూడా సోలోగా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టగలదు. పాత్ర కోసం ఎంత సాహసమైన చేయగలిగే ఈ బ్యూటీ ఇటీవల ఫామ్ లో లేని దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చివరగా నిశ్శబ్దం సినిమాతో వచ్చిన అనుష్క డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఓటీటీలో విడుదలైన నిశ్శబ్దం ఎలాంటి చప్పుడు చేయకుండా పోయింది. అయితే ఈ లాక్ డౌన్ లో చాలా కథలను విన్న అమ్మడు హీరోయిన్ ఆఫర్స్ ను అన్నిటినీ రిజెక్ట్ చేసిందట. కమర్షియల్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ చెప్పిన లేడి ఓరియెంటెడ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

సినిమాను ప్రభాస్ స్నేహితులైన యూవీ క్రియేషన్స్ నిర్మాతలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు వీరి నిర్మాణంలో చేసిన భాగమతి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా సక్సెస్ తరువాత యూవీ క్రియేషన్స్ వెంటనే అనుష్కతో మరో సినిమా చేయాలని అనుకుంది కానీ స్టోరీ సెట్టవ్వలేదు. ఇన్నాళ్లకు మహేష్ చెప్పిన కథకు అందరికి నచ్చడంతో అనుష్క డిఫరెంట్ లుక్ లో కనిపించాలని వర్కౌట్స్ మొదలు పెట్టినట్లు టాక్.