అను ఇమ్మాన్యుయేల్ తో ఎఫైర్ సాగించిన ఆ ఇద్దరు ఎవరో తెలుసా?

Anu Emmanuel

అను ఇమ్మాన్యుయేల్.. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలతో జోడీ కట్టింది. ఈ విషయంలో ఈ బ్యూటీ నిజంగా అదృష్టవంతురాలే అని చెప్పాలి. కానీ ఆ అదృష్టం ఎంతో కాలం నిలవలేదు. ఎంత వేగంగా వచ్చిందో.. అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోయింది.

Anu Emmanuel
Anu Emmanuel

ఎన్నో ఆశలతో.. మరెన్నో ఆశయాలతో వెండితెరపై వెలుగులు విరజిమ్మాలని ఆశపడ్డది. కానీ, ఏమైంది? కెరీర్ ని మాత్రం గాడిలో పడేసుకోలేక పోయింది.  అను ఇమ్మాన్యుయేల్‌కు ఊహించినంత  అదృష్టం మాత్రం కలిసిరాలేదు. ఆమె నటించిన  సినిమాలు ఒక్కొక్కటి బాక్సాఫీస్ వద్ద చతికిల పడడంతో బోరున విలపించినంత పని అయింది.

తోటి తారలు మొదట్లో అను ఇమ్మాన్యుయేల్ ని చూసి అసూయ పడ్డారు. అటు తర్వాత ఆనంద పడ్డారు. ఎందుకంటే వాళ్ళు  ఆమె పరాజయాలను చూసి నవ్వుకున్నారు. అను ఇమ్మాన్యుయేల్ తెలుగులో ఆశించిన విజయాలు సాధించలేకపోవడంతో రెండేళ్ల పాటు టాలీవుడ్‌కు దూరమైంది. ఆ సమయంలో ఓ హీరో, ఓ దర్శకుడిని నమ్ముకుంది. వారు ఎలా చెబితే అలా నడుచుకుంది. అయినా  లాభం లేకపోయింది. ఆ ఇద్దరూ తనని అన్ని విధాలా వాడుకొని మోసం చేశారని తోటి సన్నిహితుల వద్ద చెప్పుకుని తెగ బాధ పడిపోయిందట. మరి ఆ ఇద్దరూ ఎవరో మాత్రం చెప్పనూ లేదు. అప్పట్లో వారితో ఎఫైర్ కూడా కొనసాగించిందని గుసగుసలు వినిపించాయి.  

ఇది ఇలా ఉండగా, ఇటీవలే తెలుగులో పునరాగమనం చేసిన అను ఇమ్మాన్యుయేల్‌ కథాబలమున్న సినిమాలతో పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నది. తాజాగా ఆమె ఓ చక్కటి అవకాశాన్ని సొంతం చేసుకున్నది. అదే.. శర్వానంద్‌, సిద్దార్థ్‌ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘మహాసముద్రం’.  అజయ్‌భూపతి దర్శకుడు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటించనున్నది. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కోసం ఆమెను ఎంపికచేసినట్లు చిత్రబృందం చెబుతోంది.

 ప్రేమ, యాక్షన్‌, భావోద్వేగాల కలబోతగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందట. అదితీరావ్‌ హైదరీ మరో నాయికగా నటించనుంది. ఏ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  పునరాగమనంతోనైనా ఇమ్మాన్యుయేల్ ఆశలు నెరవవేరుతాయో లేదో చూద్దాం!