ఇలాగయితే ‘ఆది పురుష్’ గట్టెక్కేదెలా.?

‘ఆదిపురుష్’ మేనియా మొదలైంది. ఎంత చేసినా ఈ సినిమాకి బజ్ అయితే క్రియేట్ కావడం లేదు. ఏదో ప్రయత్నిస్తున్నారు కానీ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.

ఇదిలా వుంటే, తాజాగా ఫ్రీ టికెట్ల గోల ఈ సినిమాని మరింత ఆందోళనలోకి నెట్టేస్తోంది. ప్రముఖ హీరోలతో 10వేల చొప్పున టిక్కెట్లు కొనిపించాలనుకుంటున్నారట ‘ఆదిపురుష్’ టీమ్. డిఫరెంట్ లాంగ్వేజ్‌లలో డిఫరెంట్ హీరోలతో ఆ టిక్కెట్లు కొనిపించాలనుకుంటున్నారట.

ఏ హీరో కొన్నప్పటికీ ఈ బడ్జెట్ బాదుడు నిర్మాతల ఖాతాలోకే వెళుతుంది. ఇప్పటికే తెలంగాణాకి సంబంధించి పది వేల టిక్కెట్లు ఫ్రీగా ఇచ్చేస్తున్నామంటూ నిర్మాత ప్రకటించేశారు.

ప్రతీ ధియేటర్లోనూ, ప్రతీ షోకీ ఒక టికెట్ ఆంజనేయస్వామి పేరు చెప్పి ఫ్రిగా వదిలేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే 600 కోట్లు బడ్జెట్ మేకింగ్‌కి ఖర్చయినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ ఈవెంట్‌కి నాలుగు కోట్లు ఖర్చయినట్లు చెబుతున్నారు.

ఇంత చేసినా సినిమాకి బజ్ క్రియేట్ కావడం లేదు సరికదా.. ఫ్రీ టికెట్ల యవ్వారం మరింత డీలా పడేలా చేస్తోంది.