లేటెస్ట్ : ఆస్కార్ రేస్ లో మరో సెన్సేషనల్ ఇండియన్ సినిమా..!

తెలుగు సినిమాకి అలాగే ఇండియన్ సినిమాకి కూడా ఎప్పుడు నుంచో ఎంతో దూరంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత అవార్డు అయినటువంటి ఆస్కార్ ని తెలుగు నెలకి భారతీయ సినిమాకి తొలుత తీసుకొచ్చిన చిత్రమే ట్రిపుల్ ఆర్(RRR) సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో రకాలుగా దేశ సినిమా స్థాయిని మరో స్థాయిలో నిలబెట్టింది.

అయితే ఈ భారీ చిత్రం వేసిన దారిలో ఇండియన్ సినిమా నుంచి చాలా సినిమాలు ఆస్కార్ బరిలో నిలవనున్నాయి అని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ లిస్ట్ లో అయితే తెలుగు నుంచి ఆల్రెడీ “బలగం” సినిమా ఉండగా ఈ చిత్రం తర్వాత రీసెంట్ గా వచ్చిన బాలీవుడ్ సెన్సేషనల్ సినిమా “జవాన్” ని కూడా పంపుతామని దర్శకుడు అట్లీ తెలిపాడు.

అయితే ఈ సినిమా విషయం ఏమో కానీ ఇండియాన్ సినిమా దగ్గర సెన్సేషన్ ని నమోదు చేసిన ఓ సినిమాని అయితే ఆస్కార్ కి పంపనున్నారని ఇప్పుడు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో అయితే ఆ సినిమానే “ది కేరళ స్టోరీ” అట. హిందీలో సెన్సేషనల్ సక్సెస్ ని అందుకున్న ఈ చిత్రం అంతే రీతిలో భారీ ఎత్తున కాంట్రవర్సీ కూడా రేపింది.

దీనితో ఈ సినిమా ఓటిటి హక్కులు తీసుకోడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ మేకర్స్ పెట్టిన ఎఫర్ట్స్ కి మాత్రం మంచి సక్సెస్ థియేటర్లు లో వచ్చేసింది. కాగా ఇపుడు ఈ సినిమా కూడా అకాడమీకి పంపుతున్నారని ఇప్పుడు కన్ఫర్మ్ కాగా ఈ సినిమా నటి ఆదా శర్మ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని తెలిపింది.