త్రివిక్రమ్ తీరుపై మహేష్ అప్సెట్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఎస్ఎస్ఎంబీ28. ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుండి రోజూ ఏదో ఒక అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తూ బజ్ క్రియేట్ చేస్తోంది. వివిధ కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇదే విషయంపై సూపర్ స్టార్ త్రివిక్రమ్ పై గుర్రుగా ఉన్నట్లు ఓ గాసిప్ వినపడుతోంది.

ధనుష్ – వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన సార్ మూవీకి త్రివిక్రమ్ కొంత కాంట్రిబ్యూట్ చేసిన విషయం తెలిసిందే, అలాగే పవన్ కళ్యాణ్, సాయి తేజ్ మల్టీస్టారర్ గా వస్తున్న వినోదయ సీతం రీమేక్ చిత్రానికి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ఇన్ పుట్స్ ఇస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక డైలాగ్ రైటర్ గా కూడా ఉన్నారు. అదే విషయంపై మహేష్ బాబు కొంత అసంతృప్తిగా ఉన్నారట. త్రివిక్రమ్ ఆ సినిమాల కోసం పని చేస్తూ ఎస్ఎస్ఎంబీ28 పై పూర్తిగా ఫోకస్ పెట్టడం లేదని మహేష్ డిసప్పాయింట్ అయ్యాడట.

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ28 మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఖలేజా తర్వాత 12 ఏళ్ల అనంతరం ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే తో పాటు పాటు శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు. మూడో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, వారికి ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని భావిస్తున్నారట.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల తర్వాత తమన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో ఆల్బమ్ ఇది. ఎస్ఎస్ఎంబీ28 భారీ బడ్జెట్ మూవీని అన్ని భాషల్లోనూ విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ వేస్తోంది. రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డులకు దగ్గరగా వెళ్తామని ప్రొడ్యూసర్స్ నమ్మకంగా ఉన్నారు.