“ఆనిమల్” సెన్సేషన్ బ్యూటీకి టాలీవుడ్ లో ఈ స్టార్ తో.. 

రీసెంట్ గా ఇండియన్ సినిమా దగ్గర దుమ్ము లేపుతున్న బిగ్గెస్ బాలీవుడ్ హిట్ చిత్రం “ఆనిమల్”. మరి తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో చేసిన ఈ చిత్రం వారి కెరీర్ లోనే భారీ హైప్ నడుమ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో నటించిన చాలా మంది తలరాతలు మారిపోయాయి. అలాంటి వారిలో సినిమా సెకండాఫ్ లో కనిపించిన బ్యూటీ గర్ల్ త్రిప్తి దిమిరి కూడా ఒకరు. మరి ఆమె ఈ సినిమా తర్వాత ఒక సంచలనంగా మారిపోయింది. హిందీ సహా తెలుగులో కూడా భారీ ఆఫర్స్ ఆమెకి వచ్చాయి.

అయితే తాజాగా ఆమె టాలీవుడ్ స్టార్స్ లో ఎవరితో నటించాలి అనుకుంటుందో రివీల్ చేసింది. బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ నుంచి అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తాను స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా ఆమె తెలిపింది.

దీనితో ఈ క్రేజీ స్టేట్మెంట్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. కాగా గత కొన్ని రోజులు కితమే ఈ అంశం పై ఫేక్ రూమర్స్ ట్రోల్స్ ఎన్టీఆర్ పై కొందరు సోషల్ మీడియాలో వేసి ట్రిగ్గర్ చేశారు. కానీ షాకింగ్ గా ఆమెకి నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలి అని ఉన్న కోరిక ఇప్పుడు చెప్పడం వారికి చెంపపెట్టు గా మారింది అని చెప్పవచ్చు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఏదన్నా సినిమాకి పడాలి అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇపుడు కోరుకుంటున్నారు.