బాత్రూంను కూడా వదలరా?.. మీడియాపై అనసూయ ఫైర్

Anasuya Fires On Death Visuals Of Jaya Prakash Reddy

బుల్లితెరపై జబర్దస్త్ ప్రోగ్రాంతో అందరి మనసును కొల్లగొట్టిన అనసూయ.. క్షణం, రంగస్థలం వంటి చిత్రాలతో వెండితెరపై ఎన్నో కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై స్టార్డంను సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. అది ఏ విషయమైనా సరే తాను అనుకున్న అభిప్రాయాన్ని నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా బయటపెడుతోంది. అందర్నీ ప్రశ్నిస్తుంది కూడా.

Anasuya Fires On Death Visuals Of Jaya Prakash Reddy
Anasuya Fires On Death Visuals Of Jaya Prakash Reddy

ఇక ఈ మధ్య విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయ ప్రకాష్ రెడ్డి మరణించిన సందర్భంలో మీడియా ప్రవర్తించిన తీరుకు అనసూయ ఫైర్ అయింది. జయప్రకాష్ రెడ్డి తెల్లవారుఝామున బాత్రూంలోనే కుప్పకూలి పోయి మరణించిన సంగతి తెలిసిందే. ఎలాంటి గౌరవం లేకుండా, కనీస విలువలు పాటించకుండా చివరి దృశ్యాలను కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. వీటిపై అందరూ నిరసన వ్యక్తం చేశారు.

Anasuya Fires On Death Visuals Of Jaya Prakash Reddy
Anasuya Fires On Death Visuals Of Jaya Prakash Reddy

అదే విషయంపై స్పందిస్తూ అనసూయ దుమ్ముదులిపింది. మీడియా చేసే అతి చర్యలను ఎండగట్టింది. ఈ మేరకు అనసూయ చేసిన ట్వీట్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. బాత్రూంని కూడా వదలట్లేదు.. చావులో కూడా నీతి, విలువలు అనేవి అడుగంటిపోయాయ్.. అంటూ తన ఆవేదనను వెల్లగక్కింది. మొత్తానికి అనసూయ చేసిన ఈ ట్వీట్‌పై అందరూ ప్రశంసిస్తున్నారు.