వాహ్…’జబర్దస్త్’గా అనసూయ!

అనసూయ భరద్వాజ్ ఏమి చేసినా వైరల్‌ అవుతూ ఉంటుంది. ఏదైనా మాట్లాడినా లేక ఫోటో ఏదైనా పెట్టినా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆమె తాజాగా తన ఫోటోలు అభిమానుల కోసం తన సామాజిక మాధ్యమంలో షేర్‌ చేశారు, అవి వైరల్‌ అవుతూ వున్నాయి. అనసూయ సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి ఫోటో పెట్టినా వైరల్‌ అవుతూనే ఉంటుంది.

అందులోకి కొంచెం అందంగా, గ్లామర్‌ గా వుండే ఫోటోలు పెడితే ఇంకా చెప్పనక్కరలేదు, అవి ఇంకా వైరల్‌ అవుతాయి. కొన్ని రోజుల క్రితం అనసూయ ఒక బ్యూటీ సలోన్‌ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ సలోన్‌ ఓపెన్‌ చేసినప్పుడు ఫోటోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అనసూయ తన ఫోటోలు కూడా కొన్ని తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

అవి కూడా ఇప్పుడు బాగా వైరల్‌ అవుతున్నాయి. అలాగే ఈమధ్య ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన అనసూయ తన సామాజిక మాధ్యమాల్లో ఎందుకు ఏడుస్తున్న వీడియోస్‌ పెట్టవలసి వచ్చిందో కూడా వివరణ ఇచ్చారు. అలాగే ఈమధ్యనే ఆమె నటించిన ‘రజాకార్‌’ సినిమా విడుదలై పాజిటివ్‌ రివ్యూస్‌ తెచ్చుకుంది.

అందులో అనసూయ ఒక పాటలో కనిపించడమే కాకుండా, ఆ తరువాత వచ్చిన ఒక గొప్ప సన్నివేశంలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా చిన్నదే అయినా అనసూయకి పేరు మాత్రం బాగా వచ్చింది. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాలో కూడా అనసూయ కనిపించబోతోంది. ఇందులో ఒక నెగటివ్‌ పాత్రలో అనసూయ కనపడుతుంది. ‘పుష్ప’ మొదటి భాగంలో అనసూయ పాత్ర కన్నా, రెండో పార్టులో ఇంకా ఎక్కువ ఉంటుంది అని అంటున్నారు.

సుకుమార్‌ ఈ సినిమాకి దర్శకుడు, అల్లు అర్జున్‌ కథానాయకుడు. రష్మిక మందన్న కథానాయిక. ఆగస్టు 15న ఈ సినిమా విడుదలవుతోంది. ఏప్రిల్‌ 8న కథానాయకుడు అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక టీజర్‌ వస్తుంది అని ఈ చిత్ర నిర్వాహకులు ప్రకటించారు, ఈ సినిమా కోసం అర్జున్‌ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ టీజర్‌ లో ఈ సినిమాలో వున్న మిగతా పాత్రలు అంటే అనసూయ, రావు రమేష్‌, ఫహద్‌ ఫాజిల్‌ లను కూడా చూపెడతారా, లేక ఒక్క అల్లు అర్జున్‌ నే చూపిస్తారా అనేది ఏప్రిల్‌ 8న తెలుస్తుంది.