జాతిరత్నాలు చూసి అల్లు అర్జున్ ఏంచెప్పాడంటే ?

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జాతిరత్నాలు’. అనుదీప్‌ దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్‏గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ ఈ సినిమాపై స్పందించారు. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువ ఎప్పుడూ నవ్వలేదంటూ చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా సినిమాకు పనిచేసిన వాళ్లలో ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశాడు.

Allu Arjun review On Jathi Ratnalu  - Sakshi

 

‘నిన్న రాత్రి జాతిరత్నాలు చూశాను. నవీన్‌ పొలిశెట్టి అద్భుతంగా నటించాడు. అప్‌కమింగ్‌ హీరోగా నవీన్‌ నటన ఆకట్టుకుంటుంది. రాహుల్‌ చాలా సునాయసంగా నటించాడు. ప్రియదర్శి, ఫరియా నటన ఎంతో ప్రశంసనీయంగా ఉంది. ఈ సినిమాను నిర్మించిన నాగ్‌ అశ్విన్‌, స్వప్నా దత్‌, ప్రియాంక దత్‌లకు అభినందనలు, రథన్‌ అందించిన మ్యూజిక్‌ చాలా బాగుంది. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషిన్లందరికి నా అభినందనలు. ఇక చివరగా డైరెక్టర్‌ అనుదీప్‌కి మా అందరిని ఇంత బాగా నవ్వించినందుకు స్పెషల్‌ థ్యాంక్స్‌. ప్రతి ఒక్కరూ సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి’ అంటూ ట్వీట్‌ చేశారు. నిన్నన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

మార్చి 11న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీకి అన్ని వ‌ర్గాల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇలాంటి ఫుల్ కామెడీ చిత్రం గ‌త కొన్నేళ్లుగా రాలేద‌ని.. థియేట‌ర్ల‌లోకి వెళ్లింది మొద‌లు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత కూడా న‌వ్వు ఆగ‌డం లేద‌ని.. అప్ప‌ట్లో జంధ్యాల గారు తీసిన క్లీన్ అండ్ నీట్ కామెడీని ఈ చిత్రం గుర్తు చేస్తుంద‌ని ప‌లువురు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఈ మూవీ ప్రమోష‌న్ల‌ను బాగా చేయ‌డంతో ప‌లు థియేట‌ర్లు హౌజ్ ఫుల్ అయ్యాయి. మ‌న దేశంలోనే కాదు ఆస్ట్రేలియా, అమెరికాలోనూ జాతి ర‌త్నాల‌కు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమా యూనిట్ కూడా సంబ‌రాల‌ను జ‌రుపుకుంటోంది.