అల్లు అర్జున్ మెగా ప్యాచ్ అప్.!

మెగా వేరు.. అల్లు వేరు.. అనే స్థాయికి అభిమానుల మధ్య రచ్చ చోటు చేసుకుంటోంది. అల్లు అర్జున్ అభిమానులే ఈ రచ్చకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కారణం అని చెప్పక తప్పదు.. ఆ అభిమానులకి ‘ఆర్మీ’ అని ముద్దుగా పేరు కూడా పెట్టాడు అల్లు అర్జున్.

అయితే, ఇప్పుడు అల్లు అర్జున్ రూటు మార్చేశాడట. మెగా ప్యాచ్‌ అప్‌కి అల్లు అర్జున్ రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఇకపై ఇలాంటి రచ్చకు ఆస్కారం వుండకూడదని అనుకుంటున్నాడట. అభిమానుల మధ్య ఎలాంటి గొడవల్లేకుండా చేయాలనుకుంటున్నాడట.

ఆ దిశగా ఆల్రెడీ అల్లు అర్జున్ అడుగులు ముందుకు వేశాడనీ తెలుస్తోంది. అభిమాన సంఘాల ముఖ్యులతో ఇప్పటికే అల్లు అర్జున్ సంప్రదింపులు జరిపాడట.

అభిమానుల్ని కామ్‌గా వుండమని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట. అసలెందుకు అల్లు అర్జున్ ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు.? ఎన్నికల నేపథ్యంలో జనసేనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వుండేందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడా.? లేదంటే, నేషనల్ అవార్డు కారణంగా వచ్చిన బాధ్యత కారణంగానా.? అని ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఏది ఏమైతేనేం, అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయం మంచిదేగా.! అంటూ ఆయన్ని పలువురు సినీ మేధావులూ, సినీయర్లు ప్రశంసిస్తున్నారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి పార్ట్‌కి గాను ఆయనకు నేషనల్ అవార్డు దక్కింది ఉత్తమ నటుడిగా.! ఆ బాధ్యతను శిరసా వహించిన అల్లు అర్జున్.. మరింత జాగ్రత్తగా రెండో పార్ట్‌కి సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ షూటింగ్ దశలో వున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు. రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.