ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రూపొందనున్న భారీ చిత్రం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. పుష్ప 2 అనంతరం వెంటనే త్రివిక్రమ్తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నప్పటికీ, అట్లీ ఎంట్రీతో ఆ ప్లాన్ మార్చుకున్నాడు బన్నీ. AA22 అనే టెంటేటివ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దశలో దూసుకెళ్తోంది.
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం, మాఫియా బ్యాక్డ్రాప్లో సైన్స్ ఫిక్షన్ టచ్తో తెరకెక్కనుంది. అట్లీ మార్క్ మాస్ టేకింగ్, బన్నీ స్టైల్, హాలీవుడ్ టెక్నిక్స్ అన్నీ కలిసే ఈ సినిమా ఒక స్పెషల్ విజువల్ ఎక్స్పీరియన్స్గా ఉండబోతోంది. అట్లీ ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్ల కోసం బ్లూప్రింట్లు సిద్ధం చేయగా, బన్నీ గెటప్ కూడా పూర్తిగా కొత్తగా ఉండనుంది.
ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను 2026 డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ మధ్యలో షూటింగ్ ప్రారంభించే యోచనలో ఉన్నారు. భారీ సెట్స్, విదేశీ టెక్నీషియన్లతో సినిమా గ్రాండ్గా తెరకెక్కనుండగా, 2026 సెప్టెంబర్ నాటికి షూటింగ్ పూర్తిచేసే ప్లాన్లో ఉన్నారని టాక్.
బన్నీకి జోడీగా ప్రియాంక చోప్రా లేదా జాన్వీ కపూర్ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారన్నది త్వరలో తేలనుంది. కథ, విజువల్స్, మ్యూజిక్ అన్నింటికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఈ కాంబినేషన్ నుంచి ఒక ఇండస్ట్రీ హిట్ వస్తుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. మరి 2026 డిసెంబర్ టార్గెట్ను బన్నీ అట్లీ టీమ్ అందుకుంటుందో లేదో చూడాలి.