SS Rajamouli – Allu Aravind: ఆ విషయంలో రాజమౌళిని మోసం చేసిన అల్లు అరవింద్… అసలేం జరిగిందంటే?

SS Rajamouli – Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా రాజమౌళికి ఎంతో మంచి గుర్తింపు ఉంది. అలాగే నిర్మాతగా కూడా అల్లు అరవింద్ కు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం మగధీర. రాజమౌళి కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా మగధీర సినిమా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద సృష్టించిన రికార్డులను ఇప్పటికీ ఏ సినిమా కూడా కొన్ని రికార్డులను చరపలేదు.అయితే ఈ సినిమా విడుదల అయిన తర్వాత రాజమౌళికి నిర్మాత అల్లు అరవింద్ కి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని, రాజమౌళి అల్లు అరవింద్ ను ఒక విషయంలో మోసం చేశారని తెలుస్తోంది.

ఇక వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి గల కారణం కూడా ఈ సినిమానే అని చెప్పవచ్చు. మగధీర సినిమా తెరకెక్కించిన సమయంలో రాజమౌళి అల్లు అరవింద్ దగ్గర ఒక మాట తీసుకున్నారట.అప్పట్లో ఒక సినిమా హిట్ అయితే.. 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు అంటూ ఎన్నో అబద్ధపు రికార్డులను అభిమానులకు చూపించేవారు. కానీ మగధీర విషయంలో ఇలాంటి ఫేక్ రికార్డులను అసలు చూపించకూడదని రాజమౌళి ముందుగా అల్లు అరవింద్ దగ్గర మాట తీసుకున్నారట.

ఇకపోతే ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఈ సినిమా విజయాన్ని మొత్తం అల్లు అరవింద్ తీసుకోవాలని ప్లాన్ చేశారట అంతే కాకుండా రాజమౌళికి ఇచ్చిన మాటను పక్కన పెట్టి ఈ సినిమా 100 రోజులు 175 రోజులు అంటూ పెద్ద ఎత్తున
ఫేక్ ప్రమోషన్ లను నిర్వహించారని తెలుస్తోంది. ఇలా ఇచ్చిన మాటను తప్పి రాజమౌళిని మోసం చేశారని సమాచారం. ఇక ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలో విడుదల చేయాలని రాజమౌళి చెప్పినప్పటికీ అరవింద్ మాత్రం తమిళంలో విడుదల చేయకుండా ఉన్నారు. ఇలా ఈ మనస్పర్ధలు కారణంగానే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని రాజమౌళి ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.