Radheshyam: రాధే శ్యామ్ సినిమా చూసి, నా భార్య ఆమాట అన్నది… దర్శకుడు రాధా కృష్ణ కుమార్

Radheshyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్ ఇటీవలే విడుదలై ప్రశంసలతో పాటు, విమర్శలు ఎదుర్కోవడం కూడా అందరికీ తెలిసిందే. ఐతే దాదాపు మూడేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ప్రభాస్ సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచీ ఆయన అభిమానులు తెగ వెయిట్ చేశారు. తీరా రిలీజ్ అయ్యాక మాత్రం తాము అనుకున్న స్థాయిలో లేదని కొందరు నిరాశ పడ్డారు.

ఐతే దాదాపు 350 కోట్లు పెట్టిన ఈ సినిమా గురించి మిశ్రమ స్పందన రావడం చూసిన మూవీ మేకర్స్ ప్రస్తుతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఇలాంటి టాక్ వచ్చిందో తెలియడం లేదని తలలు పట్టుకుంటున్నారు. కాగా ఇదే విషయంపై రాధే శ్యామ్ సినిమా దర్శకుడు రాధ కృష్ణ కుమార్ స్పందించారు. ఫీల్ గుడ్ అండ్ క్లాసిక్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై వస్తున్న ప్రశంసలు, విమర్శలు ఒకే స్థాయిలో ఉన్నాయని ఆయన అన్నారు. మూవీ విడుదల సమయంలో అలా నెగటివ్ టాక్ ఎందుకు స్ప్రెడ్ అయిందో మాత్రం తమకు అర్థం కాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతున్నారని, సినిమా చాలా బాగుందని తనకు మెసేజ్లు కూడా పెడుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన భార్యకు ఈ సినిమా చాలా బాగా నచ్చిందని, కొన్ని సన్నివేశాలకు కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్టు ఆమె తనతో చెప్పిందని ఆయన తెలిపారు. ఇలా తన సతీమణి ఇచ్చిన ప్రసంశను మాత్రం మర్చిపోలేనని రాధా కృష్ణ అన్నారు.

ఇదిలా ఉండగా రాధే శ్యామ్ విడుదలైన నుంచీ ప్రభాస్ ను కలవడం వీలు కాలేదని, ఎందుకంటే అతను హాలిడే కోసం విదేశాలకి వెళ్లారని రాధా కృష్ణ స్పష్టం చేశారు. ఫోన్ కూడా తనతో మాట్లాడలేదన్న ఆయన, సమయం దొరికినప్పుడు మాత్రం మెసేజ్ లు చేసుకుంటున్నాం అని ఆయన వివరించారు.