లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి క్రేజ్ ఏమవుతుంది ..?

సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ గా … నేచురల్ బ్యూటీగా టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ఫిదా సాయి పల్లవికి ప్రేక్షకుల తో పాటు సినీ వర్గాలలో విపరీతమైన పాపులారిటీని తీసుకు వచ్చింది. అయితే ఈ సినిమా తో వచ్చిన క్రేజ్ ని అడ్డం పెట్టుకొని వచ్చిన ప్రతీ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు సాయి పల్లవి. చాలా సెటిల్డ్ గా తనకి నచ్చిన సినిమానే ఎంచుకుంది. అయితే ఫిదా తర్వాత టాలీవుడ్ లో సాయి పల్లవి కి ఆ రేంజ్ హిట్ దక్కలేదు.

Fidaa (2017) | Fidaa Telugu Movie | Movie Reviews, Showtimes | nowrunning

కాగా మరోసారి సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే నటించింది. ఈ సినిమా లో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించాడు. లవ్ స్టోరీ అన్న టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. సంక్రాంతికి రిలీజ్ చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నటు సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతి పోస్టర్ సినిమా మీద అంచనాలు పేంచేది గా ఉండటంతో అందరూ సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్సైపోయారు.

Akkineni Naga Chaitanya and Sai Pallavi's Love Story set to resume with  strict safety measures | Telugu Movie News - Times of India

ముఖ్యంగా సాయి పల్లవి కి టాలీవుడ్ లో ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఉన్న క్రేజ్ అండ్ పాపులారిటీ మరింతగా పెరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఫిదా సినిమాలో తెలంగాణా యాస లో అదరగొట్టింది. లవ్ స్టోరీ లో మరోసారి తెలంగాణ యాస లో సాయి పల్లవి చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇక నాగ చైతన్య కూడా ఈ సినిమాలో తెలంగాణ యాసలోనే మాట్లాడతాడని అంటున్నారు. చూడాలి మరి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొన్న లవ్ స్టోరీ రిజల్ట్ ఎలా ఉంటుందో.