చప్పుడు లేని “ఆదిపురుష్” పై లేటెస్ట్ ఇన్ఫో.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో ఎప్పుడో షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యి రిలీజ్ కి కూడా సిద్ధం అయ్యిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సిన సినిమా కాగా సినిమా టీజర్ తర్వాత వచ్చిన వరస్ట్ రెస్పాన్స్ తో అయితే మేకర్స్ రిలీజ్ వాయిదా వేసి మళ్ళీ గ్రాఫిక్స్ పనులు మొదలు పెట్టినట్టుగా తెలిపారు.

మరి మళ్ళీ అదనంగా 100 కోట్లు పెట్టిన మేకర్స్ అక్కడ నుంచి పెద్దగా ఎలాంటి అప్డేట్ అందించలేదు. మధ్యలో ఒకసారి మాత్రమే రిలీజ్ డేట్ ని రీ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ హిస్టారికల్ సినిమాపై అప్పటి నుంచి ఎలాంటి బజ్ లేదు ఇప్పుడు మొత్తానికి సరికొత్త అప్డేట్ అయితే తెలుస్తుంది.

దీని ప్రకారం అయితే ఈ సినిమా సరికొత్త పోస్ట్ ప్రొడక్షన్ పనులు 70 శాతానికి పైగా కంప్లీట్ అయ్యాయి అట. అలాగే జూన్ నాటికి సినిమా కొత్త హంగులతో రెడీ అవుతుందని అలాగే ఏప్రిల్ నెల నుంచి అయితే ఇక రెగ్యులర్ గా సరికొత్త అప్డేట్స్ ని అందించే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

దీనితో మొత్తానికి అయితే ఈ భారీ మైథాలాజికల్ సినిమా పై ఈ ఇన్ఫో తెలిసింది. కాగా ఈ సినిమాని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా భూషణ్ కుమార్ మరియు ఓంరౌత్ లు నిర్మాణం వహించారు. అలాగే ప్రభాస్ రామునిగా నటించగా కృతి సనన్ జానకి దేవిగా నటించింది. అలాగే సైఫ్ అలీ ఖాన్ లంకేశుని పాత్రలో నటించాడు.