షాకింగ్ : “ఆదిపురుష్” రామాయణం అని ఎవరన్నారు?

లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర వచ్చిన భారీ విజువల్ ట్రీట్ “ఆదిపురుష్” కోసం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సైఫ్ అలీఖాన్ విలన్ గా కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ అయితే తెరకెక్కించిన ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కి రిలీజ్ కి వచ్చింది.

అయితే ఇది మొన్నటివరకు మాట కానీ ఈ సినిమాపై ఈ చిత్ర రచయిత ముంతషీర్ శుక్లా లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఒకింత ఆశ్చర్యంగా మారాయి. అందరు ఈ చిత్రం అసలు రామాయణం కాదని కామెంట్ చేస్తున్నారని వచ్చిన ఫీడ్ బ్యాక్ పై తాను నేషనల్ మీడియాలో మాట్లాడుతూ..

అసలు ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కించామని ఎవరన్నారు అని? నేను కేవలం రామాయణం నుంచి ప్రేరణ మాత్రమే తీసుకొని కొత్త తరానికి కావాల్సినట్టుగా మోడ్రన్ గా అయితే ప్లాన్ చేశామని కామెంట్స్ చేశారు. దీనితో ఇపుడు ఈ ఊహించని కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.

అయితే నేటి తరానికి తగ్గట్టుగా మన ఇతిహాసాలని ఇష్టమొచ్చినట్టుగా మారుస్తారా అనే విమర్శలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఐతే ఏది ఏమైనా కూడా సినిమా మాత్రం ఇప్పుడు భారీ వసూళ్లు అయితే నమోదు చేస్తుంది. దీనితో ఇపుడు ఈ షాకింగ్ స్టేట్మెంట్ అయితే సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.