ప్రాజెక్ట్ కె కారణంగా డిజపాయింట్ అయిన ఓం రౌత్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రామాయణం ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఇక త్రీడీలో విజువల్ ఫీస్ట్ గా మూవీని అందించాలనే ప్రయత్నంలో చిత్ర యూనిట్ ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె మూవీ కూడా చేస్తున్నారు.

ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఇంటరెస్టింగ్ అప్డేట్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. కొద్ది రోజుల క్రితం రైడర్స్ అనే విలన్ గ్యాంగ్ ని ఎలా డిజైన్ చేసింది మేకింగ్ వీడియో రిలీజ్ చేసి చూపించారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ కె కారణంగా ఆదిపురుష్ టీమ్, ముఖ్యంగా ఓం రౌత్ డిజపాయింట్ అయ్యారంట.

ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలపై ఎక్కువ ప్రేక్షకుల ఆటెన్సన్ ఉంది. ఈ నేపధ్యంలో వాటికి సంబందించిన అప్డేట్స్ ఏవైనా ఇస్తే బజ్ మొత్తం వైపు వైపు వెళ్ళిపోతుంది. ఆదిపురుష్ సినిమాపై ఎక్కువగా బజ్ క్రియేట్ చేయాలంటే ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్ట్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకూడదు. ఈ విషయం ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ కి చెప్పారంట.

ఈ నేపధ్యంలో సలార్ మూవీ నుంచి అయితే ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. కాని ప్రాజెక్ట్ కె నుంచి మాత్రం ఏదో ఒక రూపంలో అప్డేట్ వస్తూనే ఉంది. ఈ విషయంలో ఓం రౌత్ కాస్తా డిజపాయింట్ అయ్యారనే మాట బిటౌన్ లో వినిపిస్తోంది. ఓం రౌత్ నేరుగా నాగ్ అశ్విన్ కి ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడినట్లు టాక్.

దీంతో ప్రాజెక్ట్ కె నుంచి కూడా ఆదిపురుష్ రిలీజ్ వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వమని హామీ ఇచ్చారంట. ఇక ప్రశాంత్ నీల్ తో కూడా ఓం రౌత్ చర్చించినట్లు టాక్. ఈ నేపధ్యంలో వారు కూడా ఆదిపురుష్ మూవీ కోసం వెయిట్ చేస్తామని చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. ఏది ఏమైనా ఆదిపురుష్ మీద అటెన్సన్ క్రియేట్ చేయడం కోసం ఓం రౌత్ మిగిలిన సినిమాలకి సంబందించిన అప్డేట్స్ రాకుండా లాక్ చేయడం గమనార్హం