ఆదిపురుష్ ట్రైలర్.. పెద్ద ప్లానే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆది పురుష్. భారీ బడ్జెట్ తో టి సిరీస్ ఈ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. రామాయణం కథ ఆధారంగా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై విజువల్ ఎఫెక్ట్స్ తో త్రీడీలో ఆవిష్కరించారు. ఇక జూన్ 16న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ప్రభాస్ ఈ మూవీలో శ్రీరాముడిగా కనిపించబోతున్నారు. సీతాదేవిగా కృతి సనన్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఆరు నెలల క్రితమే రిలీజ్ అయింది. అయితే టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాలో పాత్రల చిత్రల వక్రీకరించారని హిందుత్వ సంస్థలు వివాదం సృష్టించాయి.

అదే సమయంలో గ్రాఫిక్స్ కూడా నాసిరకంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం కావడంతో మరల విజువల్ ఎఫెక్ట్స్ పై దర్శకుడు వర్క్ చేశారు. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని జూన్ 16న రిలీజ్ కావడానికి ఈ చిత్రం రెడీ అవుతోంది. ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ ట్రైలర్ లాంచ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మే 9న ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 105 థియేటర్స్ లో త్రీడీ వెర్షన్ లో ఆది పురుష్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారంట. తాజాగా చిత్ర యూనిట్ పోస్టర్ తో ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ చేయబోయే థియేటర్స్ లిస్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం విశేషం.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక సినిమా ట్రైలర్ ని రికార్డు స్థాయిలో ఈ రేంజ్ లో థియేటర్స్ లో రిలీజ్ చేయడం మొదటిసారి అని చెప్పాలి. మొత్తానికి ఈ ట్రైలర్ లాంచ్ ద్వారా ఆది పురుష్ సినిమాని గ్రాండ్ గా మార్కెట్లోకి పంపించాలని చిత్ర యూనిట్ గట్టిగా డిసైడ్ అయినట్లు ఉంది. మరి ట్రైలర్ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుంది అనేది చూడాలి.