షాకింగ్ కాంట్రవర్సీలతో “ఆదిపురుష్” దర్శకుడు, హీరోయిన్ చేష్టలు.!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఒకే ఒక్క చిత్రం “ఆదిపురుష్”. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ అయితే ఈ సినిమాని తెరకెక్కించాడు.

మరి ఇన్ని రోజులు బాగానే ఉన్న ఏఈ చిత్రం ఇపుడు దర్శకుడు ఓంరౌత్ అలాగే హీరోయిన్ కృతి సనన్ మూలాన షాకింగ్ కాంట్రవర్సీ తో వైరల్ గా మారింది. అయితే మొన్ననే తిరుమలలో ప్రభాస్ వేంకటేశ్వరుని దర్శనం చేసుకోగా లేటెస్ట్ గా అయితే ఓం మరియు కృతి లు కూడా దర్శనం చేసుకున్నారు.

అయితే దర్శనం అయ్యాక ఆలయ ప్రాంగణంలోనే కృతి తాను కార్ లో వెళ్లిపోయే ముందు ఓంరౌత్ ఆమెకి ముద్దు పెట్టడం ముద్దు పెడుతూ ఆమెకి సెండాఫ్ ఇవ్వడం జరిగింది. దీనితో ఆలయ యాజమాన్యం తీవ్ర అభ్యంతరం చిత్ర యూనిట్ పై వ్యక్తం చేస్తున్నారు. అలాగే కృతి పై కూడా కొన్ని కామెంట్స్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో సహా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అలాగే ఇలాంటి బాలీవుడ్ లో ఎక్కడపడితే అక్కడ కామన్ కావచ్చు అలాగే ఓం కూడా కృతి తో ఉన్న చనువు తోనే అలా చేసినట్టు అనిపిస్తుంది కానీ వారు చేసిన ప్రాంతాన్ని మర్చిపోవడం అనేది పెద్ద తప్పుగా  మారింది. ఇదైతే ప్రస్తుతానికి గట్టిగానే వైరల్ అవుతుండగా ఈ అంశంపై చిత్ర యూనిట్ ఏమన్నా స్పందన అందిస్తారో లేదో చూడాలి.