ఈ సినిమాలో అభిరామ్ హీరో కాదు… ఒక పాత్ర మాత్రమే డైరక్టర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా గుర్తింపు పొందిన తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉదయ్ కిరణ్, నితిన్ ఎందరో హీరోలని ఇండస్ట్రీకి పరిచయం చేసిన తేజ ప్రస్తుతం “అహింస” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ హీరో అభిరామ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దగ్గుబాటి అభిరామ్ గురించి తేజ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో అభిరామ్ ను డెబ్యూ హీరో అని విలేకరి సంబోధించడంతో తేజ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో తేజ మాట్లాడుతూ… అభిరామ్ ని డెబ్యూ హీరో అని ఎలివేట్ చేయొద్దు. నా కథలో ఉన్న 20 క్యారెక్టర్స్ లో అభిరామ్ కూడా ఒక క్యారెక్టర్ మాత్రమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కిరణ్, నితిన్ ని హీరోగా పరిచయం చేసినప్పుడువారి గురించి ఏమైనా గట్టిగా చెప్పుకున్నామా..? లేదు కదా.. మరి ఇతడి ఎందుకు మీరు అలా పోలుస్తూ ఎక్స్ట్రా చేస్తున్నారు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేను అనుకున్న కథకు అభిరామ్ సరిపోయాడు అంతే.. అంటూ తేజ చెప్పుకొచ్చారు .

ఇక ఈ క్రమంలో సినిమా విశేషాల గురించి కూడా తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అహింసా సినిమా పక్కా మాస్ మసాలా సినిమా అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ అహింస సినిమా ని జయం సినిమా తో పోల్చుతూ వస్తున్న వార్తలపై కూడా తేజ స్పందించారు. ఈ క్రమంలో తేజ మాట్లాడుతు… ఎక్కడైనా మొత్తం 14 సినిమాలే ఉంటాయి…కానీ వాటిని చూపించే విధానంలో మార్పు ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ఎందరో యువ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసి హిట్ ఇచ్చిన తేజ దగ్గుబాటి వారసుడికి కూడా హిట్ ఇస్తాడో? లేదో? చూడాలి మరి.