ఆది పురుష్ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసిందిగా.. సంతోషంలో డార్లింగ్ ఫ్యాన్స్..?

టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు చక్కటి శుభవార్త. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆది పురుష్ సినిమా గురించి తాజాగా ఒక గుడ్ న్యూస్ ని వినిపించారు చిత్ర బృందం. అదేమిటంటే ఆదిపురుష్ సినిమా టీజర్ ను 3 న విడుదల చేయనట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులు గడిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు కూడా కల్లు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు.

దీంతో ఈ సినిమా టీజర్ గురించి ఒక గుడ్ న్యూస్ వినిపించడంతో ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. టీజర్ రిలీజ్ నుంచి జనవరి 12న తేదీ సినిమా రిలీజ్ అయ్యే వరకు పెద్ద క్యాంపెయిన్ నడవనుంది అని ప్రకటించారు మూవీ మేకర్స్. అంతేకాకుండా ఈ ఏడాది ఢిల్లీ లో జరగనున్న రావన దహన కార్యక్రమాన్ని ప్రభాస్ చేతుల మీదుగా జరిపించాలని ఇప్పటికే ప్రభాస్ కూడా ఆహ్వానం కూడా అందినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను రామాయణాన్ని ఇతివృతంగా చేసుకొని రూపొందించడం జరిగింది.

ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీత పాత్రలో అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలలో కనిపించబోతున్నారు. కాగా ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా విడుదల కానున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలలో చూడని విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చూపించనున్నట్లుగా దర్శకుడు ఓంరౌత్ వెల్లడించారు. అక్టోబర్ 3న రిలీజ్ కానున్నట్లు అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.