Acharya : ఆచార్య సినిమాపై అంచనాలు తగ్గించి విజయం సాధించాలని అనుకుంటున్నారా..?

Acharya : మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఘన విజయం తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న తొలి చిత్రమిది. అందుకే ఈ చిత్ర ప్రమోషన్ లకు సంబంధించి చిత్ర బృందం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు రివీల్ చేయటంలో కూడా చిత్ర బృందం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మంచి ఆదరణ పొందాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ కి కూడా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి,రామ్ చరణ్ ఇద్దరు ఒకే పాటలో కనిపిస్తుండటంతో ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఆచార్య సినిమాలో ఇంకా ఇలాంటి హైలెట్స్ చాలా ఉన్నాయి. ఇలా అన్నీ రివీల్ చేస్తే సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అందుకే చిత్రబృందం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆచార్య సినిమా ఘన విజయం సాధించడం కోసం సినిమా పై అంచనాలు తగ్గించడమే చిత్ర బృందం స్ట్రాటజీ అని వార్తలు వినిపిస్తున్నాయ్.

ఇక మహేష్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇందులో నిజం ఎంత ఉందొ తెలియాలి. ఆచార్య సినిమా బడ్జెట్ 150 కోట్లు కాగా, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందని సమాచారం. రామ్ చరణ్ కు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వస్తున్న ఈ ఆచార్య సినిమా ఎంతటి ఘన విజయం అందిస్తుందో చూడాలి.