ప్రభాస్ రాధేశ్యామ్ టీజర్ డ్యూరియేషన్ మీద సూపర్ అప్‌డేట్ ..!

ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా నుంచి ఎట్టకేలకి టీజర్ వచ్చేస్తోంది. ఇందుకు అద్భుతమైన డేట్ ని ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు. ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాకి యంగ్ డైరెక్టర్ రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడికల్ లవ్ స్టోరీ గా దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో రాధేశ్యామ్ తెరకెక్కుతోంది. గోపీకృష్ణ మూవీస్ – యూవీ క్రియేషన్స్ పతాకాల పై ప్రశీద .. ప్రమోద్.. వంశీ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు, భాగ్యశ్రీ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా రాధేశ్యామ్ ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని ఇంతక ముందు బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ మోషన్ టీజర్ రిలీజ్ చేసినప్పుడే మేకర్స్ వెల్లడించారు. లైలా మజ్ఞు, సలీం అనార్కలీ, దేవదాసు పార్వతి లని బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ మోషన్ టీజర్ లో రిలీజ్ చేయడం తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో దర్శకు హింట్ ఇచ్చాడు. అయితే గత కొన్ని రోజులుగా రాధేశ్యామ్ టీజర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కాగా చిత్ర బృందం రాధేశ్యామ్ టీజర్ ని ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే ఇప్పుడు టీజర్ డ్యూరియేషన్ కూడా ఎంత ఉండబోతుందో అన్న విషయం బయటకి వచ్చింది. త్వరలో రిలీజ్ చేయబోతున్న రాధేశ్యామ్ టీజర్ 1నిమిషం 30 సెకండ్ల నిడివితో టీజర్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ టీజర్ లో రొమాంటిక్స్ షాట్స్ తో పాటు యాక్షన్ బిట్స్ కూడా చూపించబోతున్నట్టు అలాగే రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ని ప్రకటించబోతున్నట్టు సమాచారం.