ప్రభాస్ ‘ పాన్ వరల్డ్ ‘ సినిమా – ఫ్యాన్స్ కి ఒళ్ళు పులకరించే అప్డేట్ వచ్చింది.

ప్రభాస్ రీసెంట్ గా రాధేశ్యాం సినిమాని కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సాధించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించబోతున్నాడు.

Prabhas, Pooja Hegde's Radhe Shyam first look: This is how celebs and  critics react to poster - IBTimes India

కాగా సలార్ కి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమా రెండు భాగాలకి పనిచేసిన టీం నే తీసుకుంటున్నాడని సమాచారం. ‘కేజీయఫ్’ సినిమాకి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ను అలాగే మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమా భారీ సక్సస్ కి కారణమైన రవి బస్రుర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నారట. దాంతో ఇప్పుడు సలార్ మీద భారీగా అంచనాలు పెరిగాయి. ఇలా ప్రతీ సినిమాకి కొత్త కొత్త ప్లాన్స్ తో సెన్షేషన్ ని క్రియేట్ చేస్తున్నారు ప్రభాస్ దర్శకులు.

Prabhas & Prashanth Collaborate For Action Saga Salaar, First Look out

ఈ క్రమంలోనే ప్రభాస్ తో వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కించబోతున్న సినిమాకి సంబంధించి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చి మరో సెన్షేషన్ ని క్రియేట్ చేశారు. నాగ్ అశ్విన్ ఈ సినిమాని పాన్ వరల్డ్ సైన్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కించబోతుండగా ఈ సినిమా షూటింగ్ ని ఈ ఏడాది ద్వితీయార్థం లో మొదలు పెట్టి వచ్చే ఏడాది అనగా 2022 లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రభాస్ వరసగా సలార్, ఆదిపురుష్ సినిమాలని మొదలు పెట్టబోతుండటం తో నాగ్ అశ్విన్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని అందరూ సందేహించారు. వాళ్ళందరికీ ఫ్యూజ్ కొట్టేసేలా దర్శకుడు నాగ్ అశ్విన్ సూపర్ క్లారిటీ ఇచ్చారు.