కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులు లక్ష రూపాయలు పొందే అవకాశం..?

ఆడపిల్లల సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాయి. ఈ పథకాలు భవిష్యత్తులో ఆడపిల్లల విద్య, వివాహం కోసం ఆర్థికంగా ఉపయోగపడుతున్నాయి. అలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా ఆడపిల్లలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పథకం ద్వార ఆడపిల్లల చదువు, వివాహం కోసం తల్లి తండ్రులు ప్రతీ యేటా లక్ష రూపాయలు పొందవచ్చు. ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఈ పథకం ద్వారా ఆడపిల్లలు ఎలాంటి లబ్ధి పొందుతున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో సమాజంలో పురుషులతోపాటు స్త్రీలు కూడా అన్ని విషయాలలోనూ సమాన హక్కులు కలిగి ఉండటం చాలా అవసరం. అలాగే ఆర్థిక సమానత్వ స్థిరత్వం సాధించడం కూడా మహిళలకు చాలా అవసరం. కాబట్టి మహిళలకు ఆర్థికపరంగా ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశ పెట్టింది . ముఖ్యంగా ఈ పథకంలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఆడపిల్లల ఉన్నత చదువు సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టటానికి బ్యాంకులు లేదా ఇండియా పోస్ట్ బ్రాంచ్‌లో పొదుపు ఖాతను తెరవవచ్చు. ఇక ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 7.6 శాతం వడ్డీ వస్తుంది. మీరు మీ పెట్టుబడి, వ్యవధి ఆధారంగా మీ లాభన్ని తెలుసుకోవచ్చు.

ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని పొందటానికి భారత పౌరులకు మాత్రమే అర్హత ఉంది. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అమ్మాయి వయసు పదేళ్లకు మించకూడదు. అలాగే సుకన్య సమృద్ధి యోజన ఖాతా కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే తెరుస్తారు.. సుకన్య పథకంలో అకౌంట్ తీసుకోవాలంటే కనీస మొత్తం రూ.250తో ఖాతా ప్రారంభించాలి. గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ ఈ ఖాతా దాచుకోవచ్చు. ఉదాహరణకు మీరు పది సంత్సరాల కాలనికి 7.6 శాతం వడ్డీరేటుతో నెలకు రూ.8333 పెట్టుబడి పెడితే అది సంవత్సరానికి రూ. లక్ష అవుతంది. అయితే మెచ్యూర్ అయ్యాక వడ్డీతో కలిపి రూ.15,29,458 లాభాన్ని మీరు పొందవచ్చు.. ఇప్పటివరకు ఖాతాను తెరవని వాళ్ళు ఇప్పుడే ఓపెన్ చేసి మంచి లాభాలను పొందండి..