బియ్యం పురుగు పట్టకుండా నిల్వ ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే!

Rice_AdobeStock_64819529_E

మనలో చాలామంది బియ్యం పురుగు పట్టడం వల్ల ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు పడుతుంటారు. ఒకే సమయంలో ఎక్కువ మొత్తంలో బియ్యం కొనుగోలు చేస్తే మాత్రం పురుగు పట్టడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. కొంతమంది బియ్యం పురుగు పట్టకుండా ఉండటం కోసం కొన్ని రకాల రసాయనాలను వినియోగించడం జరుగుతుంది. నిల్వ ఉన్న బియ్యం తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

బియ్యంలో పురుగులు ఉంటే పురుగులు విసర్జించిన వ్యర్థాలు సైతం అలాగే ఉండిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటి బియ్యం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మార్కెట్ లో దొరికే కెమికల్ పౌడర్లను బియ్యానికి కలిపితే పురుగులు పోయినా కొత్త ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బియ్యం నిల్వ చేసే డబ్బాలలో బిర్యానీ ఆకులను ఉంచితే మంచిది.

ఈ ఆకులను ఉంచడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. బియ్యం నిల్వ చేసిన డబ్బాలలో లవంగాలను ఉంచినా బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం అయితే ఉంటుంది. బియ్యంలో వెల్లుల్లి పొట్టు ఉంచడం వల్ల కూడా బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని చెప్పవచ్చు. చిన్న గుడ్డలో కర్పూరంను కట్టి ఉంచడం ద్వారా కూడా బియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

వేపాకును వాడటం ద్వారా కూడా బియ్యం ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని చెప్పవచ్చు. శుభ్రం చేసిన డబ్బాలలో బియ్యం ఉంచితే మాత్రమే మంచిదని చెప్పవచ్చు. బెల్లం లేదా పొగాకు ఉంచినా ఆ బియ్యంలో పురుగులు రాకుండా ఉంటాయి. డిసికాన్ ప్యాకెట్లను ఉపయోగించడం వల్ల బియ్యానికి పురుగు పట్టకుండా ఉంటుంది.