కరోనా వైరస్ వల్ల ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ వైరస్ వల్ల దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హెచ్3 ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్ కేసులు దేశంలో పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. శరీరంలోని అవయవాలపై ఈ వైరస్ తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు ఈ వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ వ్యాధి తేలికపాటి వ్యాధి అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. భౌతిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా రక్షించుకోవచ్చు. చిన్నారులు ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటే మంచిది. దగ్గు, జ్వరం, న్యూమోనియా, శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది.
బీపీ, డయాబెటిస్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఇతర వ్యాధుల బారిన పడిన వాళ్లకు ఈ వైరస్ మరింత ప్రమాదకరం అని చెప్పవచ్చు. ఈ వైరస్ వల్ల కిడ్నీలు ఫెయిలయ్యే అవకాశం అయితే ఉంటుంది. డయాలసిస్ చేయించుకున్న వాళ్లు సైతం ఈ వైరస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ వైరస్ వల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది.
తలనొప్పి, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, ఇతర లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ఆక్సిజన్ శాచురేషన్ తక్కువగా ఉన్నా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే బెటర్ అని చెప్పవచ్చు.
