గుడిలో గంట మోగించడం వెనుక అసలు కారణాలివే.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

గుడిలో గంట మోగించడం అనేది హిందూ మతంలో ఒక పవిత్రమైన ఆచారంగా ఉంది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గంట శబ్దం దైవత్వాన్ని ఆహ్వానిస్తుంది మరియు దేవతల అనుగ్రహం మనపై ఉండాలని మనం కోరుకుంటున్నామని తెలియజేస్తుంది. గంట శబ్దం శరీరం, మనసు మరియు పరిసరాలను శుద్ధి చేసి, ప్రతికూల శక్తులను తొలగిస్తుంది.

గంట ఓం అనే పవిత్రమైన శబ్దాన్ని సూచిసుంది. ఇది హిందూ తత్వశాస్త్రంలో విశ్వం యొక్క ప్రాథమిక శబ్దం అని చెప్పవచ్చు. గంట శబ్దం మనస్సును నిరంతర ఆలోచనల నుండి విడదీసి, మనస్సులో గ్రహణ శక్తిని మరింత పెంచుతుంది. గంట మోగించడం ద్వారా భక్తులు దేవుడితో ప్రార్థనను ప్రారంభించే ముందు తమను తాము సిద్ధం చేసుకుంటారు.

హిందూ సంప్రదాయంలో గంట శబ్దం దైవత్వాన్ని ఆహ్వానించడం, పవిత్రత మరియు శుద్ధి, విశ్వం యొక్క ప్రాథమిక శబ్దం, మనస్సును నియంత్రించడం మరియు ప్రార్థనను ప్రారంభించడం వంటి అనేక అర్ధాలను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. పురాతన నమ్మకాల ప్రకారం, ఆలయ గంటను మోగించడం వల్ల అధిష్టాన దేవత యొక్క స్పృహ మేల్కొంటుందని చెప్పవచ్చు.

గంట మోగించకుండా ప్రార్థన చేయడం కంటే పూర్తిగా మేల్కొన్న దేవుడిని ఆరాధించడం మరింత ఫలవంతంగా మరియు ప్రభావవంతంగా పరిగణించబడుతుందని పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం, ఆలయ గంటలను మోగించడం వల్ల చేసిన పాపాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి.