కేంద్రం సూపర్ స్కీమ్స్.. రూ.18 ఏళ్లు నిండిన వాళ్లకు రూ.4 లక్షల బెనిఫిట్ పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల కోసం వేర్వేరు స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పేర్లతో కేంద్రం రెండు పథకాలను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్స్ లో చేరడం ద్వారా సులువుగా 4 లక్షల రూపాయల బెనిఫిట్ పొందే అవకాశం అయితే ఉంటుంది.

సురక్ష బీమా యోజన ప్రీమియం గతంలో 12 రూపాయలు ఉండగా ఇప్పుడు ఆ మొత్తం 20 రూపాయలుగా ఉంది. కేంద్రం జీవన్ జ్యోతి బీమా యోజన పేరుతో మరో స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ప్రీమియం గతంలో 330 రూపాయలుగా ఉండగా ఇప్పుడు ఆ మొత్తాన్ని 436 రూపాయలకు పెంచడం జరిగింది. 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందవచ్చు.

సురక్ష బీమా స్కీమ్‌ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా వర్తిస్తుంది. ప్రాణాలు కోల్పోయినా, అంగ వైకల్యం సంభవించినా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు ఇప్పటికే ఈ స్కీమ్ కోసం రిజిష్టర్ చేసుకున్నారు. పేద ప్రజలకు ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉండాలనే సదుద్దేశంతో ఈ స్కీమ్స్ అమలవుతుండటం గమనార్హం.

ఇప్పటివరకు ఈ స్కీమ్ లో చేరని వాళ్లు ఉంటే సమీపంలోని బ్యాంక్స్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు ఈ స్కీమ్స్ లో జాయిన్ కావచ్చు. జన్ సురక్ష స్కీమ్స్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ బెనిఫిట్స్ ను పొందడానికి ఈ స్కీమ్స్ బెస్ట్ స్కీమ్స్ అని చెప్పవచ్చు.