మహిళలకు అదిరిపోయే స్కీమ్.. ఆ స్కీమ్ ద్వారా ఏకంగా 1,62,000 పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 1,62,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పశు పోషణపై ఆధారపడ్డ మహిళలకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలగనుంది.

ఇప్పటికే పాడి రంగంపై ఆధారపడిన వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. ప్రాంతీయ పశువైద్య కార్యాలయం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మండలానికి 300 మంది ఈ స్కీమ్ ద్వారా అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ స్కీమ్ ద్వారా పొందిన రుణాన్ని చెల్లించే సమయం ఆధారంగా వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.

ఈ స్కీమ్ ద్వారా పొందిన రుణానికి 7 శాతం వడ్డీ కాగా అందులో 4 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 3 శాతం వడ్డీ మాత్రం ప్రభుత్వం భరించే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరికైతే పశువులు ఉంటాయో వాళ్లు మాత్రమే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పశువుల దాణా, షెడ్, ఇతర అవసరాల కోసం ఈ రుణాన్ని వినియోగించవచ్చు.

కేంద్రం అమలు చేస్తున్న బెస్ట్ స్కీమ్స్ లో ఈ స్కీమ్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ స్కీమ్ గురించి సమీపంలోని బ్యాంక్ లను సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పాడి మహిళలు ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని రుణం తీసుకుంటే మంచిది.